యాప్నగరం

ఆఖరి వికెట్‌‌తో ఇంగ్లండ్ అద్భుత పోరాటం

బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పోరాడే స్కోరు సాధించింది.

TNN 12 Jan 2017, 2:32 pm
ముంబైలో భారత్-ఎ జట్టుతో జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 48.5 ఓవర్లలో 282 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది పరుగులు చేసింది. ఇంగ్లిష్ ఓపెనర్లు జాసన్ రాయ్, హేల్స్ ఆ జట్టుకు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించాక జాసన్ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో హేల్స్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాక నదీమ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కాసేపటి తర్వాత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. హాఫ్ సెంచరీ సాధించిన బెయిర్‌స్టో 64 పరుగుల వద్ద అవుట్ కాగా, బట్లర్ డకౌట్‌గా వెనుదిరగడంతోపాటు.. మొయిన్ అలీ ఒక్క పరుగు వద్ద అవుట్ కావడంతో ఇంగ్లండ్ 165 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Samayam Telugu india a vs england england all out for 282 runs in second warm up match
ఆఖరి వికెట్‌‌తో ఇంగ్లండ్ అద్భుత పోరాటం


ఆ తర్వాత కూడా ఇంగ్లండ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒకానొక దశలో ఆ జట్టు 211 రన్స్‌కే 9 వికెట్లు కోల్పోయింది. మరి కాసేపట్లో ఇంగ్లండ్ ఆలౌట్ అవుతుందని భావించగా.. ఆ జట్టును రషీద్ (39), విల్లే (30 బంతుల్లో 30 రన్స్ నాటౌట్) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి చివరి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. దీంతో ఇంగ్లండ్ అనూహ్యంగా రహానే సేన ముందు 283 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

భారత్ ఎ జట్టు బౌలర్లలో పర్వేజ్ రసూల్ మూడు వికెట్లు తీయగా.. సాంగ్వన్, దిండా, నదీమ్‌లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. కౌట్ ఒక వికెట్ తీశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.