యాప్నగరం

లంకతో వన్డే సిరీస్‌కి జట్టు ప్రకటన

ధోనీకి ప్రత్యామ్నాయంగా భావించిన రిషబ్‌ పంత్‌కి చుక్కెదురైంది. అతనితో పాటు దినేశ్ కార్తీక్‌‌ని పక్కన పెట్టిన సెలక్టర్లు

TNN 13 Aug 2017, 8:41 pm
శ్రీలంకతో ఆగస్టు 20 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌ కోసం 15 మందితో కూడిన భారత్ జట్టును ఆదివారం రాత్రి బీసీసీఐ ప్రకటించింది. గత ఏడు వన్డేల్లో కేవలం 162 పరుగులతో పేలవ ప్రదర్శన చేసిన సీనియర్ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్‌పై వేటు పడగా.. ఇటీవల దక్షిణాఫ్రికాలో ముగిసిన ముక్కోణపు సిరీస్‌లో భారత్-ఎ జట్టును కెప్టెన్‌గా విజయవంతంగా నడిపించిన మనీశ్ పాండే‌‌కి చోటు దక్కింది. ఈ ఏడాది కఠినమైన సిరీస్‌లు ఉన్న నేపథ్యంలో సీనియర్ బౌలర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌లకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. ముంబయికి చెందిన ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్‌కి అవకాశం కల్పించారు.
Samayam Telugu india announce odi squad yuvraj singh dropped manish pandey returns
లంకతో వన్డే సిరీస్‌కి జట్టు ప్రకటన


మరోవైపు ధోనీకి ప్రత్యామ్నాయంగా భావించిన రిషబ్‌ పంత్‌కి చుక్కెదురైంది. అతనితో పాటు దినేశ్ కార్తీక్‌‌ని పక్కన పెట్టిన సెలక్టర్లు.. జడేజా, అశ్విన్‌కి విశ్రాంతినిచ్చి వారి స్థానంలో కుల్దీప్ యాదవ్, చాహల్, అక్షర్‌ పటేల్‌‌కి ఛాన్స్ ఇచ్చారు. ఇటీవల బెంగళూరులో ఫిటెనెస్ సైతం నిరూపించుకున్న సురేశ్ రైనాకి మళ్లీ నిరాశే ఎదురైంది. అతని స్థానంలో గాయంతో దాదాపు ఆరు నెలలు వన్డే, టీ20లకి దూరమైన ఓపెనర్ కేఎల్ రాహుల్‌ జట్టులోకి పునరాగమనం చేశాడు.

వన్డే జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, అజింక్య రహానె, కేదార్ జాదవ్, ధోని, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, శార్ధూల్ ఠాకూర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.