యాప్నగరం

రైనాకి పిలుపు.. భారత టీ20 జట్టు ప్రకటన

దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టుని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. దాదాపు

TNN 28 Jan 2018, 12:42 pm
దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టుని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. దాదాపు ఏడాదికాలంగా టీమిండియాకి దూరంగా ఉంటున్న టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనాకి అనూహ్యంగా ఈ జట్టులో చోటు దక్కింది. విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని ఈ టీ20 జట్టుకి వైస్‌కెప్టెన్‌గా రోహిత్ శర్మని ఎంపిక చేసినట్లు బోర్డు వెల్లడించింది. గత ఏడాది చివర్లో శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకోగా.. జట్టుకి తాత్కాలిక కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించిన విషయం తెలిసిందే.
Samayam Telugu india announce squad for t20is against south africa suresh raina returns
రైనాకి పిలుపు.. భారత టీ20 జట్టు ప్రకటన


ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సురేశ్ రైనా మెరుపు శతకంతో ఫామ్‌లోకి వచ్చి.. పరుగుల వరద పారించాడు. గత ఏడాదే యో-యో ఫిటెనెస్ టెస్టు‌లో కూడా ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ పాసవడంతో సెలక్టర్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తాజాగా టీ20 జట్టులో ఛాన్సిచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్ ముగియగా.. ఫిబ్రవరి 1నుంచి ఆరు వన్డేల సిరీస్ జరగనుంది. ఆ తర్వాత.. ఫిబ్రవరి 18 నుంచి ఈ టీ20 సిరీస్ జరగనుంది.

భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, మనీశ్ పాండే, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్, శార్ధూల్ ఠాకూర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.