యాప్నగరం

ఆ మహిళా క్రికెటర్‌తో డిన్నర్‌కి వెళ్తా: భారత ఓపెనర్

టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ ఓపెనర్ మురళీ విజయ్ పేలవ ఫామ్ కారణంగా 2018లో టీమ్‌లో చోటు కోల్పోయాడు. ఇప్పట్లో రీఎంట్రీ ఇచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు.

Samayam Telugu 15 Apr 2020, 7:39 pm
ఆస్ట్రేలియాకి చెందిన మహిళా క్రికెటర్‌తో తాను డిన్నర్‌కి వెళ్లేందుకు సిద్ధమని భారత సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్ వెల్లడించాడు. కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించడంతో ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటున్న మురళీ విజయ్.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకి సమాధానమిచ్చిన మురళీ విజయ్.. ఆస్ట్రేలియా క్రికెటర్ ఎల్లిస్ పెర్రీ చాలా అందంగా ఉంటుందని కితాబిచ్చాడు.
Samayam Telugu Murali Vijay


Read More: క్రమశిక్షణ లేదు.. కర్ఫ్యూ విధించండి: హర్భజన్

మురళీ విజయ్ మీరు డిన్నర్‌కి వెళ్లాలనుకునే ఇద్దరు క్రికెటర్లని ఎంపిక చేయండి అని ఓ అభిమాని కోరగా.. అతను సమాధానమిచ్చాడు. ‘‘ఎల్లిస్ పెర్రీతో నేను డిన్నర్‌కి వెళ్లాలని ఆశిస్తున్నాను. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఇక రెండో క్రికెటర్ శిఖర్ ధావన్. అతను చాలా ఫన్నీగా ఉంటాడు. మా ఇద్దరి సంభాషణ కూడా సరదాగా ఉంటుంది. ధావన్ హిందీలో మాట్లాడితే.. నేను తమిళంలో మాట్లాడుతుంటాను’’ అని మురళీ విజయ్ వెల్లడించాడు.

Read More: ఐపీఎల్‌పై ఫ్రాంఛైజీలకి బీసీసీఐ సమాచారం

2018లో ఆఖరిగా టీమిండియా తరఫున మ్యాచ్‌లాడిన మురళీ విజయ్.. 2019 ఐపీఎల్ సీజన్‌లో ఆఖరిగా అభిమానులకి కనిపించాడు. ఆ తర్వాత పూర్తిగా దేశవాళీ క్రికెట్‌కే పరిమితమైన ఈ తమిళనాడు క్రికెటర్.. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశించాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ నిరవధికంగా వాయిదాపడింది. ఐపీఎల్‌లో 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.