యాప్నగరం

ఖుషీ.. ఖుషీగా కోహ్లిసేన ప్రాక్టీస్..!

టెస్టు సిరీస్‌లో శ్రీలంకని క్లీన్‌స్వీప్ చేసిన భారత్ జట్టు ఆదివారం నుంచి జరగనున్న వన్డే సిరీస్‌కి నూతనుత్తేజంతో సిద్ధమవుతోంది.

TNN 19 Aug 2017, 2:59 pm
టెస్టు సిరీస్‌లో శ్రీలంకని క్లీన్‌స్వీప్ చేసిన భారత్ జట్టు ఆదివారం నుంచి జరగనున్న వన్డే సిరీస్‌కి నూతనుత్తేజంతో సిద్ధమవుతోంది. సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో కఠినమైన సిరీస్‌ ఉన్న నేపథ్యంలో కొంతమంది సీనియర్లకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు జూనియర్లకి అవకాశం కల్పించారు. దీంతో ప్రస్తుతం డ్రెస్సింగ్‌ రూము సీనియర్, జూనియర్ల కలయికతో కళకళలాడుతోంది. ప్రాక్టీస్‌ సెషన్‌లో కూడా ప్రధాన కోచ్ రవిశాస్త్రి రూల్స్‌ని సడలించి ఆటగాళ్లకి తగినంత స్వేచ్ఛనిస్తున్నాడు. దీంతో క్రికెటర్లు మూడు జట్లుగా ఏర్పడి ఫుట్‌బాల్ మ్యాచ్‌తో దంబుల్లాలో సరదాగా తమ ఫిటెనెస్‌‌ని పరీక్షించుకున్నారు.
Samayam Telugu india begin search for world cup core take on sri lanka
ఖుషీ.. ఖుషీగా కోహ్లిసేన ప్రాక్టీస్..!


మూడు జట్లకి నాయకులుగా కెప్టెన్ కోహ్లి, మాజీ కెప్టెన్ ధోని, కేఎల్ రాహుల్ ఉండగా.. కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్ల ఫుట్‌బాల్ ఆటని పరిశీలించాడు. ఈ ఫొటోలని బీసీసీఐ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రాక్టీస్ సెషన్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యలని ఎక్కువగా గుడ్ లెంగ్త్ బంతులు విసరాలని రవిశాస్త్రి పురమాయించాడట. ముఖ్యంగా నోబాల్స్‌ విసరకుండా ఉండేందుకు బుమ్రాకి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.