వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్న అండర్-19 వరల్డ్కప్లో భారత సంతతి స్పిన్నర్ నివేతన్ రాధాకృష్ణన్ తన లెప్ట్-రైట్ బౌలింగ్తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగిన నివేతన్ రాధాకృష్ణన్.. గయానా వేదికగా వెస్టిండీస్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టాడు. కుడి చేతి వాటం బ్యాట్స్మెన్కి లెప్ట్ హ్యాండ్తో బౌలింగ్ చేసిన నివేతన్ రాధాకృష్ణన్.. ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్కి రైట్ హ్యాండ్తో బౌలింగ్ చేశాడు. దాంతో.. వెస్టిండీస్ యువ జట్టు నివేతన్ రాధాకృష్ణన్ బౌలింగ్ని ఎదుర్కొనేందుకు చాలా ఇబ్బందిపడింది. మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ అండర్-19 జట్టు 40.1 ఓవర్లలో 169 పరుగులకి ఆలౌటైంది. మ్యాచ్లో 10 ఓవర్లు వేసిన నివేతన్ రాధాకృష్ణన్ 48 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా యువ జట్టులో 10 ఓవర్ల కోటాని పూర్తి చేసిన బౌలర్ నివేతన్ రాధాకృష్ణన్ మాత్రమే కావడం విశేషం. అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 44.5 ఓవర్లలో 170/4తో ఛేదించేసింది. నివేతన్ రాధాకృష్ణన్ తనకి ఆరేళ్ల వయసు నుంచే తండ్రి సూచన మేరకు రెండు చేతులతో బౌలింగ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేశాడు.
19 ఏళ్ల నివేతన్ రాధాకృష్ణన్కి గత ఏడాదే ఐపీఎల్లోని ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పిలుపు వచ్చింది. అయితే.. నెట్ బౌలర్గా మాత్రమే అతడ్ని ఢిల్లీ ఎంపిక చేసింది. ఐపీఎల్ 2022 సీజన్ ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా జరగనుండగా.. నివేతన్ రాధాకృష్ణన్ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడే అవకాశం ఉంది.
19 ఏళ్ల నివేతన్ రాధాకృష్ణన్కి గత ఏడాదే ఐపీఎల్లోని ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పిలుపు వచ్చింది. అయితే.. నెట్ బౌలర్గా మాత్రమే అతడ్ని ఢిల్లీ ఎంపిక చేసింది. ఐపీఎల్ 2022 సీజన్ ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా జరగనుండగా.. నివేతన్ రాధాకృష్ణన్ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడే అవకాశం ఉంది.