భారత్ ఓటమికి కారణం ఆ తప్పిదాలే..!
మ్యాచ్లో బౌలర్లు ఒక గంట బంతిపై నియంత్రణ కోల్పోయినా.. కష్టమే. సిరీస్లో భారత్ జట్టు కొన్ని గెలిచే అవకాశాల్ని సృష్టించుకుంది. కానీ.. ఒక మూడో టెస్టులో మాత్రమే ఆ ఛాన్స్లను వినియోగించుకుని గెలవగలిగింది.
Samayam Telugu 13 Sep 2018, 4:52 pm
ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్ని భారత్ చేజార్చుకోవడానికి కారణం తప్పుల్ని పునరావృతం చేయడమేనని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. గత మంగళవారం ఓవల్ వేదికగా ముగిసిన చివరి టెస్టులో 118 పరుగుల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్ జట్టు.. ఐదు టెస్టుల సిరీస్ని 4-1తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఆరంభం నుంచి ఇంగ్లాండ్ టెయిలెండర్లను ఔట్ చేయడంలో భారత్ బౌలర్లు విఫలమవుతూ వచ్చారని.. దీనికి తోడు ఓపెనర్లు కూడా వైఫల్యాల బాట కొనసాగించడం జట్టు విజయావకాశాల్ని దెబ్బతీసిందని లక్ష్మణ్ వివరించాడు.
‘ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ని వేగంగా పెవిలియన్కి చేర్చినా.. టెయిలెండర్లను ఔట్ చేయడంలో మాత్రం భారత బౌలర్లు విఫలమయ్యారు. దీంతో.. వారే ఆ జట్టు విజయానికి బాటలు వేస్తూ వచ్చారు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో నెం.1గా ఉన్న జట్టు ఇలాంటి ప్రదర్శన చేయడమా..? మ్యాచ్లో ఒక గంట బౌలర్లు బంతిపై నియంత్రణ కోల్పోయినా.. కష్టమే. సిరీస్లో భారత్ జట్టు కొన్ని గెలిచే అవకాశాల్ని సృష్టించుకుంది. కానీ.. ఒక మూడో టెస్టులో మాత్రమే ఆ ఛాన్స్లను వినియోగించుకుని గెలవగలిగింది. ఓపెనర్లు మెరుగైన ఆరంభాలు ఇవ్వకపోవడం కూడా జట్టు విజయావకాశాల్ని దారుణంగా దెబ్బతీసింది’ అని వీవీఎస్ లక్ష్మణ్ వివరించాడు.
‘ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ని వేగంగా పెవిలియన్కి చేర్చినా.. టెయిలెండర్లను ఔట్ చేయడంలో మాత్రం భారత బౌలర్లు విఫలమయ్యారు. దీంతో.. వారే ఆ జట్టు విజయానికి బాటలు వేస్తూ వచ్చారు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో నెం.1గా ఉన్న జట్టు ఇలాంటి ప్రదర్శన చేయడమా..? మ్యాచ్లో ఒక గంట బౌలర్లు బంతిపై నియంత్రణ కోల్పోయినా.. కష్టమే. సిరీస్లో భారత్ జట్టు కొన్ని గెలిచే అవకాశాల్ని సృష్టించుకుంది. కానీ.. ఒక మూడో టెస్టులో మాత్రమే ఆ ఛాన్స్లను వినియోగించుకుని గెలవగలిగింది. ఓపెనర్లు మెరుగైన ఆరంభాలు ఇవ్వకపోవడం కూడా జట్టు విజయావకాశాల్ని దారుణంగా దెబ్బతీసింది’ అని వీవీఎస్ లక్ష్మణ్ వివరించాడు.