యాప్నగరం

టీమిండియా బెస్ట్ రిజర్వ్ ప్లేయర్లు ఎవరో చెప్పిన చీఫ్ సెలెక్టర్

తన పదవీకాలంలో టీమిండియాకు ఎంపికై ప్రస్తుత రిజర్వ్‌లో ఉన్న ఆటగాళ్లలో అత్యుత్తమ ప్లేయర్ల గురించి చీఫ్ సెలెక్టర్ ప్రసాద్ మాట్లాడాడు. నలుగురు బ్యాట్స్‌మెన్, ఆరుగురు బౌలర్లు పేర్లను పేర్కొన్నాడు. భవిష్యత్తులో వీరిలో కొందరు టీమిండియా తరపున సత్తాచాటాగలరని విశ్వాసం వ్యక్తం చేశాడు.

Samayam Telugu 3 Jan 2020, 3:00 pm
భారత చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ పదవీకాలం దాదాపుగా ముగిసిపోయింది. నాలుగేళ్ల కిందట చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రసాద్ సుదీర్ఘకాలం సేవలందించాడు. అయితే తన పదవీకాలంలో ప్రస్తుత రిజర్వ్‌లో ఉన్న ప్లేయర్లు.. రేపటి రోజుల్లో మేటి భారత ఆటగాళ్లుగా తయారవుతారని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌లో ముఖ్యంగా లోకేశ్ రాహుల్, బౌలింగ్‌లో నవదీప్ సైనీలాంటి వాళ్లు ఫ్యూచర్ స్టార్లుగా అభివర్ణించారు. వీరిలో కొందరు ప్రస్తుతం ప్లేయింగ్ లెవన్‌లో ఆడుతున్నారు. తమ హాయంలో ఎంపిక చేసిన ఆటగాళ్లతో టీమ్ పటిష్టంగా మారిందని చెప్పుకొచ్చాడు.
Samayam Telugu Mumbai: BCCI selection committee Chairman MSK Prasad interacts with media perso...
MSK Prasad


Read Also : ఔట్‌పై ఫీల్డ్ అంపైర్‌తో శుభమన్ గిల్ గొడవ.. ప్రత్యర్థి టీమ్ వాకౌట్
తన పదవీకాలంలో సిస్టమాటిక్ పద్ధతి ద్వారా రిజర్వ్ ఆటగాళ్లను ఎంపిక చేశామని, వారికి తరచూ ఇండియా-ఎ జట్టులో స్థానం కల్పించి వివిధ టూర్లు ఆడించామని అభివర్ణించాడు. ప్రస్తుతానికి ఓపెనర్‌గా రోహిత్ శర్మ కుదురుకున్నాడని అయితే రాబోయే రోజుల్లో మయాంక్ అగర్వాల్, పథ్వీ షా, రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పంచల్‌లాంటి ఆటగాళ్లు ఓపెనర్లుగా సత్తాచాటుతారని వ్యాఖ్యానించాడు.

Read Also : Virat Kohliకి పోటీనిస్తున్న స్టీవ్‌స్మిత్ సింగిల్ కోసం 39 బంతులు.. 44 నిమిషాలు
ఇక బౌలింగ్ విషయానికొస్తే ప్రస్తుతం జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ ఆకట్టుకుంటున్నారని ప్రసాద్ తెలిపాడు. అయితే వారికి బ్యాకప్‌గా నవదీప్ సైనీ, అవేశ్ ఖాన్, బాసిల్ థంపి, సందీప్ వారియర్, ఇషాన్ పోరెల్, మహ్మద్ సిరాజ్ వ్యవహరించనున్నారని వ్యాఖ్యానించాడు. భవిష్యత్తులో తమకు లభించిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నట్లు తెలిపాడు. తమ హయాంలో భారత జట్టు అభివృద్ధికి బాటలు వేశామని, భారత్‌ను అన్ని ఫార్మాట్లలో బలమైన జట్టుగా రూపొందించేందుకు తోడ్పడగలదని ప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇప్పటికే ప్రసాద్, గగన్ ఖోడా పదవీకాలం ముగియగా.. ఇతర సెలెక్టర్లు జతిన్ పరాంజపే, శరణ్‌దీప్ సింగ్, దేవాంగ్ గాంధీకి మరో ఏడాది టెన్యూర్ ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీరిని కొనసాగించే అవకాశాలు లేవు.

Read Also : కేక పుట్టిస్తున్న విరాట్ కోహ్లీ కొత్త హెయిర్‌స్టైల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.