యాప్నగరం

టెస్టుల్లో లంకేయుల్ని ఊడ్చేసిన కోహ్లిసేన..!

టెస్టుల్లో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత్ జట్టు జైత్రయాత్ర శ్రీలంకలోనూ కొనసాగింది. సోమవారం ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా

TNN 14 Aug 2017, 2:49 pm
టెస్టుల్లో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత్ జట్టు జైత్రయాత్ర శ్రీలంకలోనూ కొనసాగింది. సోమవారం ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 3-0 తేడాతో లంకేయుల్ని ఊడ్చేసింది. పల్లెకలె వేదికగా శనివారం ఆరంభమైన చివరి టెస్టుల్లో పూర్తిస్థాయి‌ ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ మరో రెండు రోజులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్, 171 పరుగుల తేడాతో మ్యాచ్‌ని గెలుపుగా ముగించేసింది.
Samayam Telugu india complete dominating series sweep
టెస్టుల్లో లంకేయుల్ని ఊడ్చేసిన కోహ్లిసేన..!


సోమవారం 19/2తో ఫాలోఆన్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక జట్టు భారత్ బౌలర్లు అశ్విన్ (68/3), మహ్మద్ షమీ (3/32) ధాటికి 181 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో డిక్వెల్లా (41) ఒక్కడే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 487 పరుగులకు ఆలౌటవగా.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌటైంది. ఆగస్టు 20 నుంచి శ్రీలంకతో భారత్ ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.