యాప్నగరం

షమీ బాటలో ఉమేశ్..? రీఎంట్రీ కోసం నిరీక్షణ

నాలుగేళ్ల క్రితం భారత్ జట్టులో అగ్రశ్రేణి బౌలర్‌గా నీరాజనాలు అందుకున్న ఉమేశ్ యాదవ్.. ఇప్పుడు వన్డే, టీ20 జట్టులో చోటు కోసం నిరీక్షిస్తున్నాడు. అతను వన్డేలాడి రెండేళ్లయింది.

Samayam Telugu 30 Jan 2020, 7:07 pm
భారత ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ మళ్లీ వన్డే, టీ20ల్లో ఆడాలని ఆశిస్తున్నాడు. టీమిండియా తరఫున గత ఏడాది టెస్టుల్లో నిలకడగా రాణించిన ఉమేశ్ యాదవ్.. గత 12 నెలలుగా ఒక్క వన్డే, టీ20 కూడా భారత్ తరఫున ఆడలేకపోయాడు. మరోవైపు ఇన్నాళ్లు టెస్టు బౌలర్‌గా ముద్ర వేసుకున్న మహ్మద్ షమీ.. వన్డే, టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు. ఈ నేపథ్యంలో.. ఉమేశ్ యాదవ్ కూడా షమీ బాటలోనే నడిచేందుకు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu Ranchi: Indian cricketers Mohammed Shami and Umesh Yadav pose with the trophy af...


Read More: విహారి బ్యాడ్‌లక్.. కామెడీ తరహాలో ఔట్

2015 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచిన ఉమేశ్ యాదవ్.. ఆ తర్వాత లయ తప్పాడు. ఎంతలా అంటే..? 2018లో చివరిగా టీమిండియా తరఫున వన్డేలాడిన ఈ పేసర్.. 2019 ఫిబ్రవరిలో ఆఖరిగా టీ20 జెర్సీ ధరించాడు. ఈ నేపథ్యంలో అతని పరిమిత ఓవర్ల క్రికెట్ కెరీర్ ముగిసిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ.. తాను రీఎంట్రీ కోసం సిద్ధమవుతున్నట్లు తాజాగా ఉమేశ్ చెప్పుకొచ్చాడు.

Read More: సూపర్ ఓవర్‌లో రోహిత్ వ్యూహం ఫలించిన వేళ..!
‘మ్యాచ్‌లు జరుగుతుంటే..? గ్రౌండ్ వెలుపల కూర్చోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది..? నేను మనిషినే. అందుకే మళ్లీ వన్డే, టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు కఠినంగా శ్రమిస్తున్నాను’ అని ఉమేశ్ యాదవ్ వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో ప్రస్తుతం ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ జట్టు తలపడుతుండగా.. మహ్మద్ షమీ డెత్ ఓవర్లలో తన అనుభవాన్ని రంగరించి మ్యాచ్‌ల్ని మలుపు తిప్పుతున్నాడు.

Read More: చెపాక్ స్టేడియంలో స్టాండ్స్‌కి మోక్షం.. CSK హ్యాపీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.