యాప్నగరం

భారత్‌తో కష్టమే కానీ.. బంగ్లానే గెలుస్తుంది

కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో శుక్రవారం రాత్రి శ్రీలంకని ఓడించి ఫైనల్‌కి చేరిన బంగ్లాదేశ్..

TNN 17 Mar 2018, 8:24 pm
కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో శుక్రవారం రాత్రి శ్రీలంకని ఓడించి ఫైనల్‌కి చేరిన బంగ్లాదేశ్.. ఆదివారం భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఈ టోర్నీ లీగ్ దశలో భారత్‌తో తలపడిన రెండు సార్లూ పరాజయం చవిచూసిన బంగ్లాదేశ్ బదులు తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. శుక్రవారం రాత్రి మ్యాచ్ ముగిసే సమయంలో శ్రీలంక ఆటగాళ్లతో గొడవ, విజయానంతరం నాగిని స్టైల్ సంబరాలతో ఇప్పుడు క్రికెట్‌ ప్రపంచంలో బంగ్లాదేశ్ హాట్ టాఫిక్‌గా మారింది. ఈ ఆత్మవిశ్వాసంతోనే భారత్‌ని తాము ఓడించగలమని బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ శనివారం మీడియా సమావేశంలో ధీమా వ్యక్తం చేశాడు.
Samayam Telugu india is tough but momentum is on our side shakib
భారత్‌తో కష్టమే కానీ.. బంగ్లానే గెలుస్తుంది


‘భారత్ జట్టు బలంగా ఉంది. కానీ.. బంగ్లాదేశ్ వరుస స్ఫూర్తివంతమైన విజయాలో మంచి ఊపు మీదుంది. కాబట్టి.. ఫైనల్లో కూడా ఆ జోరుని బంగ్లా కొనసాగిస్తుందనే నమ్మకం నాకుంది’ అని షకిబ్ అల్ హసన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. శ్రీలంక ఆటగాళ్లతో గొడవ గురించి మాట్లాడుతూ ‘ టీ20 మ్యాచ్ అంటే ఆ మాత్రం భావోద్వేగం, ఉత్కంఠ సహజం. లక్కీగా మేము మ్యాచ్ గెలిచాం. చివరి ఐదు ఓవర్లలో బంగ్లాదేశ్ జట్టు ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఇదొకటి’ అని వివరించాడు. ఆదివారం రాత్రి 7 గంటలకి కొలంబో వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.