యాప్నగరం

ఐపీఎల్ ముంగిట.. టీమిండియా స్పిన్నర్ చాహల్‌ ఎంగేజ్‌మెంట్

మార్చి నుంచి ఇంటికే పరిమితమై టిక్‌టాక్ వీడియోలతో విరాట్ కోహ్లీ నుంచి మొట్టికాయలు తిన్న చాహల్.. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా అతనికి ఎంగేజ్‌మెంట్ జరిగింది.

Samayam Telugu 8 Aug 2020, 8:05 pm
టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్ నిశ్చితార్థం శనివారం పూర్తయింది. కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మతో తనకి ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చాహల్ ఈరోజు అభిమానులతో పంచుకున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున చాహల్ ఈ టోర్నీలో ఆడనున్నాడు.
Samayam Telugu Yuzvendra Chahal
( Yuzvendra Chahal Twitter handle)



కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత మార్చి నుంచి భారత క్రికెటర్లు ఆటకి దూరంగా ఉండిపోగా.. ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఆగస్టు 20 తర్వాత యూఏఈకి ఆటగాళ్లు వెళ్లనున్నారు. ఈ కరోనా బ్రేక్ సమయంలో వరుస టిక్ టాక్ వీడియోలు చేసిన చాహల్.. విరాట్ కోహ్లీ, క్రిస్‌గేల్, ఏబీ డివిలియర్స్, యువరాజ్ సింగ్ తదితరులతో మొట్టికాయలు తిన్నాడు. అతను చేసిన ఫన్నీ టిక్‌ టాక్ వీడియోలు చూసిన కోహ్లీ.. చాహల్ అంతర్జాతీయ స్థాయిలో ఆడే క్రికెటర్ అంటే ఎవరూ నమ్మరని అభిప్రాయపడ్డాడు.


భారత వన్డే, టీ20 జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా కొనసాగుతున్న చాహల్.. టెస్టుల్లో మాత్రం ఇంకా అరంగేట్రం చేయలేదు. దాంతో.. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా.. డిసెంబరు 3 నుంచి ప్రారంభంకానున్న ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపికవ్వాలని ఈ స్పిన్నర్ ఆశిస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.