యాప్నగరం

IND vs WI 1st T20: భారత ఓపెనర్లను బోల్తా కొట్టించాడు

ఈడెన్ గార్డెన్స్‌లో జరగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ పేసర్ థామస్ నిప్పులు చెరిగే బంతులతో భారత ఓపెనర్లను పెవిలియన్ బాట పట్టించాడు.

Samayam Telugu 4 Nov 2018, 11:35 pm
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో స్వల్ప స్కోరుకే టీమిండియా ఓపెనర్లు ఔటయ్యారు. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 16 పరుగులకే ఓపెనర్లు రోహిత్ శర్మ (6), శిఖర్ ధావన్ (3) వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఇద్దరినీ విండీస్ బౌలర్ థామస్ పెవిలియన్ బాట పట్టించాడు. నిప్పులు చెరిగే బంతులతో థామస్ రోహిత్, ధావన్‌లను ఇబ్బంది పెట్టాడు.
Samayam Telugu Rohit Sharma And Dhawan


ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే టీమిండియా కెప్టెన్ రోహిత్‌ వికెట్ కోల్పోయింది. ఫోర్ కొట్టి కాన్ఫిడెంట్‌గా కనిపించిన రోహిత్ ఓవర్ చివరి బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. విండీస్ కీపర్ రామ్‌దిన్ అందుకున్న క్యాచ్‌కు తొలి వికెట్‌గా రోహిత్ వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో థామస్ మరోసారి భారత్‌ను దెబ్బకొట్టాడు. గంటకు 147 కి.మీ వేగంతో థామస్ వేసిన బంతిని ధావన్ డిఫెన్స్ ఆడాలని చూడగా.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 16 పరుగులకు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.

విండీస్ కెప్టెన్ కార్లోస్ బ్రాత్ వైట్ బౌలింగ్‌లో రాణించాడు. లోకేష్ రాహుల్ (22 బంతుల్లో 16)తో పాటు హార్డ్ హిట్టర్ రిషబ్ పంత్ (1) వికెట్లు పడగొట్టి విండీస్ శిబిరంలో ఆశలు రేపాడు. రాహుల్, పంత్ క్యాచ్ ఔట్‌ కాగా, విండీస్ ఫీల్డర్ డారెన్ బ్రేవో వీరి క్యాచ్‌లు అందుకున్నాడు. దీంతో భారత్ 50 పరుగులకే 4 ప్రధాన వికెట్లు కోల్పోయింది.

మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (3/ 13)‌తో పాటు బౌలర్లందరూ సమష్టిగా రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులకే పరిమితమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.