యాప్నగరం

విశాఖ మ్యాచ్‌కు డోకాలేదు

విశాఖ వేదికగా జరగాల్సిన వన్డే సిరీస్ తుది మ్యాచ్ కు తుపాను ముప్పు తప్పినట్లే అని భావిస్తున్నారు

TNN 29 Oct 2016, 1:44 am
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య విశాఖ వేదికగా జరగాల్సిన వన్డే సిరీస్ తుది మ్యాచ్ కు తుపాను ముప్పు తప్పినట్లే అని భావిస్తున్నారు. ఐదు మ్యాచుల సిరీస్ రెండేసి మ్యాచ్ లు గెలుచుకుని సమఉజ్జీలుగా నిలిచిన భారత్, న్యూజిలాండ్ జట్లలో విజేత ఎవరో తేలాలంటే శనివారం నాటి ఫైనల్ మ్యాచ్ చూడాల్సిందే. అదిగో ఇదిగో అంటూ భయపెట్టిన కయాంత్ తుపాన్ విశాఖను తాకితే మ్యాచ్ రద్దవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అది బలహీనపడి దిశను మార్చుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తుపాను ముప్పు తప్పడంతో ఇరు జట్ల క్రికెటర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. మ్యాచ్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. భారత్, కివీస్ ఆటగాళ్లు శుక్రవారమే విశాఖపట్టణం చేరుకున్న సంగతి తెలిసిందే.
Samayam Telugu india newzealand final match may not be suspended
విశాఖ మ్యాచ్‌కు డోకాలేదు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.