యాప్నగరం

వన్డేల్లో ధోనీపై వేటు వేయబోతున్నారా..?

ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న రిషబ్ పంత్‌తో ధోనీ కెరీర్‌కి ఎలాంటి ప్రమాదం ఉండదు. 2019 ప్రపంచకప్‌ వరకూ ధోనీ ఆడతాడని మన అందరికీ తెలుసు -బీసీసీఐ అధికారి

Samayam Telugu 10 Oct 2018, 1:43 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై వన్డేల్లో వేటు వేయబోతున్నారా..? అంటే అవుననే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వెస్టిండీస్‌తో ఈనెల 21 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌ కోసం త్వరలోనే జట్టుని సెలక్టర్లు ప్రకటించనున్నారు. అయితే.. ఈ జట్టులో మహేంద్రసింగ్ ధోనీకి చోటు దక్కడం అనుమానంగా కనిపిస్తోంది.
Samayam Telugu dhoni-bowled


ఇటీవల ఇంగ్లాండ్‌పై చివరి టెస్టులో శతకం బాది వెలుగులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. గత వారం వెస్టిండీస్‌తో ముగిసిన తొలి టెస్టులోనూ 92 పరుగులతో మెరిసిన విషయం తెలిసిందే. దీంతో.. వన్డేల్లోనూ వికెట్ కీపర్‌గా అతనికి అవకాశమివ్వాలని మాజీ క్రికెటర్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండంతో సెలక్టర్లు ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహేంద్రసింగ్ ధోనీ కూడా గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్నాడు. గత నెల దుబాయ్‌లో ముగిసిన ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌పై డకౌటైన ధోనీ.. టోర్నీలో భారత్‌ని గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు.

‘ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న రిషబ్ పంత్‌తో ధోనీ కెరీర్‌కి ఎలాంటి ప్రమాదం ఉండదు. 2019 ప్రపంచకప్‌ వరకూ ధోనీ ఆడతాడని మన అందరికీ తెలుసు’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఒకవేళ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో రిషబ్ పంత్‌కి అవకాశమిచ్చినా.. ప్రపంచకప్‌లో మాత్రం ధోనీనే ఆడిస్తామని మరో అధికారి వెల్లడించారు. ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ కోటాలో గత ఐదు నెలలుగా దినేశ్ కార్తీక్ వన్డే జట్టులో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.