యాప్నగరం

ఇండియా ఓపెన్‌ సెమీస్ చేరిన సింధు

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో టైటిల్‌కి చేరువైంది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్‌ సూపర్‌ 500

TNN 2 Feb 2018, 7:41 pm
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో టైటిల్‌కి చేరువైంది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్‌ సూపర్‌ 500 వరల్డ్‌ టూర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పీవీ సింధు సెమీస్‌‌లో అడుగుపెట్టింది. స్పెయిన్‌కి చెందిన బీట్రిజ్ కారల్స్‌తో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పీవీ సింధు 21-12, 19-21, 21-11 తేడాతో అలవోకగా గెలుపొందింది.
Samayam Telugu india open sindhu wins praneeth kashyap lose in quarters
ఇండియా ఓపెన్‌ సెమీస్ చేరిన సింధు


35 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌‌ని రెండో సెట్‌లోనే మన షట్లర్ ముగించేలా కనిపించింది. కానీ.. చివర్లో చేసిన చిన్న పొరపాటు కారణంగా.. మ్యాచ్ మూడో సెట్‌‌కి వెళ్లింది. ప్రిక్వార్టర్‌లో బల్గేరియాకి చెందిన లిండాని వరుసగా రెండు సెట్లలో ఓడించి మంచి ఫామ్‌లో ఉన్న సింధు‌కి మూడో సెట్‌లో స్పెయిన్ షట్లర్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. భారత పురుషుల సింగిల్స్‌లో ప్రణీత్, కశ్యప్ క్వార్టర్స్‌లో పరాజయం చవిచూశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.