యాప్నగరం

వికెట్ ఎక్కడ బుమ్రా..? కంగారులో భారత్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ధారాళంగా పరుగులిచ్చేస్తున్న జస్‌ప్రీత్ బుమ్రా.. కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోతున్నాడు. దీంతో.. భారత్ జట్టులో అతని బౌలింగ్‌పై కంగారు మొదలైంది.

Samayam Telugu 10 Feb 2020, 5:17 pm
న్యూజిలాండ్‌ పర్యటనలో జస్‌ప్రీత్ బుమ్రా పేలవ బౌలింగ్‌ ఇప్పుడు టీమిండియాలో కంగారు పెంచుతోంది. గత రెండు వన్డేల్లో కలిపి 20 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 117 పరుగులు సమర్పించుకుని కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? చివరిగా ఆడిన ఐదు వన్డేల్లో కలిపి బుమ్రా కేవలం ఒకే ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. దీంతో.. వికెట్ టేకింగ్ బౌలర్‌ ఇలా తేలిపోతున్నాడేంటి..? అని భారత్ జట్టు ఆందోళన చెందుతోంది. భారత్, న్యూజిలాండ్ మధ్య మంగళవారం ఉదయం 7.30 గంటల నుంచి మూడో వన్డే జరగనుంది.
Samayam Telugu Virat Kohli , Jasprit Bhumrah


Read More: undefined

జస్‌ప్రీత్ బుమ్రా లయ తప్పడంతో టీమిండియాలో కంగారు గురించి భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ గురించి భారత్ జట్టులో ఆందోళన కనిపిస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ.. జట్టుకి వికెట్‌ అవసరమైన ప్రతిసారి బుమ్రా చేతికి బంతిని అందిస్తూ ఉంటాడు. కానీ.. కివీస్ పర్యటనలో బుమ్రానే లయ తప్పాడు. దీంతో.. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌‌లు అతడి బౌలింగ్‌ని అలవోకగా ఎదుర్కోగలుగుతున్నారు. ముఖ్యంగా.. రాస్‌టేలర్ (గత రెండు వన్డేల్లోనూ కివీస్‌ని గెలిపించిన బ్యాట్స్‌మెన్) ముందుండి బుమ్రా బౌలింగ్‌లో పరుగులు రాబడుతున్నాడు’ అని లక్ష్మణ్ వెల్లడించాడు.

Read More: IND vs NZ 3rd ODIకి భారత్ జట్టులో రెండు మార్పులు.. జస్‌ప్రీత్ బుమ్రా ఔట్
గత ఏడాది చివర్లో వెన్ను గాయంతో మూడు నెలలు క్రికెట్‌కి దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా.. జనవరిలో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ.. పునరాగమనంలో బుమ్రా బౌలింగ్‌లో మునుపటి పదును కనిపించడం లేదు. ముఖ్యంగా.. డెత్ ఓవర్లలో గతంలోలా యార్కర్లని సంధించడంలో ఈ అగ్రశ్రేణి పేసర్ విఫలమవుతున్నాడు.

Read Also: మూడో వ‌న్డేలో కివీస్‌లో 3 మార్పులు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.