Australia tour of India 2023 : భారత్ టెస్టు జట్టులో ప్రస్తుతం రిషబ్ పంత్ (Rishabh Pant) లేనందుకు ఆస్ట్రేలియా టీమ్ హ్యాపీగా ఉందని ఆ దేశ మాజీ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా బౌలర్లని ఏడాది క్రితం ఉతికారేసిన రిషబ్ పంత్.. టెస్టుల్లో కూడా ఆ దేశ స్పిన్నర్లకి చుక్కలు చూపించేసిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా.. పంత్ దెబ్బకి ఆస్ట్రేలియా (Australia) టాప్ స్పిన్నర్ నాథన్ లయన్ బెంబేలెత్తిపోయాడు. అయితే.. గత ఏడాది చివర్లో రిషబ్ పంత్కి యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పటికీ ముంబయిలోని ఆసుపత్రిలో పంత్ చికిత్స తీసుకుంటున్నాడు. అతని మోకాలితో పాటు కాలి మడమకి కూడా వైద్యులు సర్జరీ చేశారు. ఇప్పట్లో పంత్ క్రికెట్ ఆడలేకపోవచ్చు. భారత్, ఆస్ట్రేలియా మధ్య (India vs Australia) గురువారం నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. తొలి టెస్టు మ్యాచ్కి నాగ్పూర్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఇప్పటికే రెండు జట్లూ అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత భారత్ గడ్డపై ఆస్ట్రేలియా టీమ్ టెస్టుల్లో ఆడబోతోంది. నాగ్పూర్లో ఆస్ట్రేలియా టీమ్ చివరికిగా 2008లో టెస్టు మ్యాచ్ ఆడింది. అలానే 2004 నుంచి ఇప్పటి వరకూ భారత్ గడ్డపై ఆస్ట్రేలియా జట్టు టెస్టు సిరీస్ని గెలవలేదు. గురువారం నుంచి స్టార్ట్ అయ్యే 4 టెస్టుల సిరీస్లోనూ గెలుస్తామనే నమ్మకం కంగారూలకి లేదు. కానీ.. రిషబ్ పంత్ లేకపోవడం మాత్రం ఆ టీమ్కి గొప్ప ఊరటట.
‘‘రిషబ్ పంత్ని ఈ సిరీస్లో భారత్ జట్టు చాలా మిస్ అవుతుంది. అయితే.. ఆస్ట్రేలియా టీమ్ మాత్రం హ్యాపీ. ఎందుకంటే రిషబ్ పంత్ కౌంటర్ అటాకర్. కేవలం ఒక్క సెషన్లోనే మ్యాచ్ గమనాన్ని పూర్తిగా రిషబ్ పంత్ మార్చేయగలడు. అలాంటి విధ్వంసక ప్లేయర్ అతను’’ అని ఇయాన్ ఛాపెల్ చెప్పుకొచ్చాడు.
2018లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన రిషబ్ పంత్.. ఇప్పటి వరకూ 33 టెస్టులాడి 5 సెంచరీలు నమోదు చేశాడు. అలానే 11 అర్ధశతకాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా.. రిషబ్ పంత్ కేవలం 33 టెస్టుల్లోనే 247 ఫోర్లు, 55 సిక్సర్లు కొట్టడం అతని దూకుడుకి నిదర్శనం. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం భారత్ జట్టులోకి పంత్ స్థానంలో ముగ్గురు వికెట్ కీపర్లని సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ లిస్ట్లో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్తో పాటు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఉన్నారు.
Read Latest Sports News, Cricket News, Telugu News
‘‘రిషబ్ పంత్ని ఈ సిరీస్లో భారత్ జట్టు చాలా మిస్ అవుతుంది. అయితే.. ఆస్ట్రేలియా టీమ్ మాత్రం హ్యాపీ. ఎందుకంటే రిషబ్ పంత్ కౌంటర్ అటాకర్. కేవలం ఒక్క సెషన్లోనే మ్యాచ్ గమనాన్ని పూర్తిగా రిషబ్ పంత్ మార్చేయగలడు. అలాంటి విధ్వంసక ప్లేయర్ అతను’’ అని ఇయాన్ ఛాపెల్ చెప్పుకొచ్చాడు.
2018లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన రిషబ్ పంత్.. ఇప్పటి వరకూ 33 టెస్టులాడి 5 సెంచరీలు నమోదు చేశాడు. అలానే 11 అర్ధశతకాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా.. రిషబ్ పంత్ కేవలం 33 టెస్టుల్లోనే 247 ఫోర్లు, 55 సిక్సర్లు కొట్టడం అతని దూకుడుకి నిదర్శనం. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం భారత్ జట్టులోకి పంత్ స్థానంలో ముగ్గురు వికెట్ కీపర్లని సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ లిస్ట్లో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్తో పాటు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఉన్నారు.
Read Latest Sports News, Cricket News, Telugu News