యాప్నగరం

టీ20 వరల్డ్‌కప్‌కి భారత్ ఆతిథ్యమివ్వాలి..!

కరోనా వైరస్ కారణంగా 2020 టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదాపడగా.. వింబుల్డన్ కూడా వాయిదాపడింది. దీంతో.. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌ని వాయిదా వేయాలా లేదా రద్దు చేయాలా అనే సందిగ్ధదంలో ఐసీసీ పడిపోయింది.

Samayam Telugu 21 Apr 2020, 9:11 pm
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు -నవంబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌కి భారత్ ఆతిథ్యమిస్తే బాగుంటుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియాలో లాక్‌డౌన్ విధించిన ఆ దేశ ప్రభుత్వం.. సెప్టెంబరు 30 వరకూ పర్యాటక వీసాలపై ఆంక్షలు విధించింది. దీంతో.. అక్కడ టీ20 వరల్డ్‌కప్‌ జరగడంపై సందేహాలు నెలకొనగా.. టోర్నీని వాయిదా లేదా రద్దు చేయాలని కూడా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu T20 World Cup


Read More: ఇషాంత్ శర్మ 4, 6.. జడేజాకి ధోనీ చివాట్లు

2021లో టీ20 వరల్డ్‌కప్‌కి భారత్ ఆతిథ్యమివ్వనుండగా.. ఇప్పుడు భారత్, ఆస్ట్రేలియా ఓ ఒప్పందానికి వచ్చి ఆతిథ్య హక్కుల్ని మార్చుకోవాలని గవాస్కర్ సూచించాడు. ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారం టీ20 వరల్డ్‌కప్‌కి భారత్ ఆతిథ్యమిస్తే..? వచ్చే ఏడాది ఆస్ట్రేలియా‌లో టీ20 వరల్డ్‌కప్ జరిగేలా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఒప్పందం కుదుర్చుకోవాలని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్‌ని నిరవధికంగా వాయిదా వేసిన బీసీసీఐ.. టీ20 వరల్డ్‌కప్ కంటే ముందే ఐపీఎల్‌ని నిర్వహించాలని యోచిస్తోంది.

Read More: ధోనీ హేళనతోనే ఆ రేసు మొదలైంది: బ్రావో

భారత్‌లో మార్చి నెల నుంచి లాక్‌డౌన్ కొనసాగుతుండగా.. మే 3తో ముగియనుంది. ఆ తర్వాత ఐపీఎల్ 2020 సీజన్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఒకవేళ సెప్టెంబరు- అక్టోబరులో ఐపీఎల్ నిర్వహిస్తే.. ఆ వెంటనే భారత్‌ వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగితే..? ఆటగాళ్ల ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉండనుంది. అలానే క్రికెటర్లకి కూడా ఐపీఎల్ రూపంలో చాలినంత ప్రాక్టీస్ లభిస్తుందని గవాస్కర్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.