యాప్నగరం

IND vs AUS 2022: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌‌కి భారత్ జట్టు ఇదే

India vs Australia T20 Series కోసం 16 మందితో కూడిన జట్టుని భారత సెలెక్టర్లు సోమవారం ప్రకటించారు. టీ20 వరల్డ్‌కప్ 2022 జట్టులోకి ఎంపివకని మహ్మద్ షమీ, దీపక్ చాహర్‌కి కూడా ఈ టీమ్‌లో చోటు దక్కింది.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 12 Sep 2022, 6:24 pm

ప్రధానాంశాలు:

  • ఆస్ట్రేలియాతో ఈ నెలలో మూడు టీ20లను ఆడనున్న భారత్
  • చివరి టీ20 మ్యాచ్‌కి హైదరాబాద్ ఆతిథ్యం
  • 16 మందితో టీమ్‌ని ప్రకటించిన సెలెక్టర్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu India Squad For Aus T20I
భారత టీ20 జట్టు (Pic Source: Twitter)
ఆస్ట్రేలియాతో ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్ కోసం భారత సెలెక్టర్లు ఈరోజు జట్టుని ప్రకటించారు. 16 మందితో కూడిన ఈ జట్టుకి కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. అలానే చాలా రోజుల తర్వాత టీ20 జట్టులోకి మహ్మద్ షమీ ఎంపికవగా.. దీపక్ చాహర్‌కి కూడా చోటిచ్చారు. ఇక గాయం నుంచి కోలుకున్న జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్‌కి కూడా టీ20 వరల్డ్‌కప్ ముంగిట ఈ సిరీస్‌ ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. షమీ, చాహర్‌ని మాత్రం టీ20 వరల్డ్‌కప్‌కి స్టాండ్ బై ప్లేయర్లుగా సెలెక్టర్లు ఎంపికచేశారు. బుమ్రా, హర్షల్‌కి మాత్రం టీ20 వరల్డ్‌కప్ రెగ్యులర్ టీమ్‌లో చోటు దక్కింది. అలానే టీ20 వరల్డ్‌కప్ జట్టులోకి ఎంపికైన అర్షదీప్ సింగ్‌కి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నుంచి సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో తలపడే భారత్ జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేందర్ చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్.

ఆస్ట్రేలియాతో ఈ నెల 20న మొహాలి వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. ఆ తర్వాత 23న నాగ్‌పూర్‌లో రెండో టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. ఇక చివరి టీ20 మ్యాచ్‌కి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకూ టీ20 వరల్డ్‌కప్ 2022 జరగనున్న నేపథ్యంలో జట్టు కూర్పు విషయంలో టీమిండియాకి ఈ సిరీస్ కీలకం.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.