యాప్నగరం

T20 World Cup: భారత సెమీస్‌ ప్రత్యర్థి ఎవరంటే.?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ జోరు క‌న‌బ‌రుస్తోంది. నాలుగు వ‌రుస విజ‌యాల‌తో అందరికంటే ముందుగా సెమీస్‌కు చేరుకుంది. తాజాగా ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జ‌ట్లు నాకౌట్‌కు అర్హ‌త సాధించాయి.

Samayam Telugu 3 Mar 2020, 6:26 pm
ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న టీ20 మ‌హిళా ప్ర‌పంచ‌క‌ప్ తుదిద‌శ‌కు చేరుకుంది. ఇప్ప‌టికే లీగ్ ద‌శ ముగియ‌డంతో సెమీస్ బెర్త్‌లు ఖ‌రార‌య్యాయి. నాలుగు వ‌రుస విజ‌యాల‌తో భార‌త్ అంద‌రికంటే ముందుగా సెమీస్‌కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియాతోపాటు, ద‌క్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ నాకౌట్ పోరుకు చేరుకున్నాయి. సెమీస్‌లో మాజీ చాంపియ‌న్ ఇంగ్లాండ్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. 2018 ఎడిష‌న్‌లో ఇదే సీన్ రిపీట్ అవ‌గా.. అప్పుడు భార‌త్‌ను ఓడించిన ఇంగ్లాండ్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది.
Samayam Telugu Australia India Cricket Womens T20 World Cup
The Indian team


Read Also: కింగ్ వచ్చేశాడు.. ధోనీ రాకపై నెటిజ‌న్ల సందడి

మంగ‌ళ‌వారం ద‌క్షిణాఫ్రికా-వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్ద‌వ‌డంతో ఇరుజ‌ట్ల‌కు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో సౌతాఫ్రికా గ్రూప్‌-బిలో అగ్ర‌స్థానం ద‌క్కించుకోగా.. ఇంగ్లాడ్ రెండో స్థానానికి ప‌రిమిత‌మైంది. ఈక్ర‌మంలో గ్రూప్‌-ఎ టాప‌ర్ భార‌త్‌తో ఇంగ్లాండ్‌, ఆసీస్‌తో ప్రొటీస్ త‌ల‌ప‌డ‌నున్నాయి.

Read Also: ఐపీఎల్: ఒక్కచాన్స్ కోసం ఎదురుచూస్తున్న స్టార్లు

గురువారం సిడ్నీ వేదిక‌గా సెమీస్ మ్యాచ్‌లు జ‌రుగుతాయి. తొలి సెమీస్ భార‌త్‌-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతుంది. ఈక్ర‌మంలో రెండేళ్ల కింద‌ట త‌మ‌ను సెమీస్‌లోనే ఓడించిన ఇంగ్లీష్ టీమ్‌పై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని టీమిండియా భావిస్తోంది. దీంతో తొలిసారి మెగాటోర్నీ ఫైన‌ల్‌కు చేరుకోవాల‌ని భావిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.