యాప్నగరం

Under 19 World Cupలో భారత్ కుర్రాళ్ల దెబ్బకి జపాన్ 41కే ఆలౌట్.. ఐదుగురు డకౌట్

1, 7, 0, 0, 0, 0, 0, 7, 5, 1, 1.. అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత బౌలర్ల దెబ్బకి జపాన్ బ్యాట్స్‌మెన్‌ల స్కోర్లు ఇవి. లక్ష్యాన్ని భారత్ కేవలం 4.5 ఓవర్లలోనే ఊదేసింది.

Samayam Telugu 21 Jan 2020, 4:58 pm
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో భారత్ కుర్రాళ్లు అదరగొడుతున్నారు. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 90 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ అండర్-19 టీమ్.. మంగళవారం జపాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.
Samayam Telugu India, Under-19 World Cup 2020


జపాన్‌తో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ ప్రియమ్ గార్గె ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ జట్టు.. భారత్ బౌలర్ల ధాటికి ఏమాత్రం నిలవలేకపోయింది. రవి (4/5), కార్తీక్ త్యాగి (3/10)తో పాటు అకాశ్ సింగ్ (2/11), విద్యాధర్ పటిల్ (1/8) చెలరేగిపోవడంతో.. జపాన్ జట్టు విలవిలలాడింది. ఎంతలా అంటే..? ఆ జట్టులో అందరూ సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమవగా.. ఏకంగా ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లు డకౌటయ్యారు. దీంతో.. 22.5 ఓవర్లలోనే జపాన్ టీమ్ 41 పరుగులకి ఆలౌటైపోయింది.

42 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత ఓపెనర్లు కేవలం 4.5 ఓవర్లలోనే ఊదేశారు. యశస్వి జైశ్వాల్ (29 నాటౌట్: 18 బంతుల్లో 5x4, 1x6), కుమార్ కుసర్గా (13 నాటౌట్: 11 బంతుల్లో 2x4) ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్‌కి 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు. ఇక టోర్నీలో తర్వాత మ్యాచ్‌ని న్యూజిలాండ్ జట్టుతో శుక్రవారం ఆడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.