యాప్నగరం

కరీబియన్ గడ్డపై మ్యాచ్‌లకి భారత్ రెడీ..!

నాలుగు రోజులే విరామం.. మళ్లీ అభిమానుల్ని అలరించేందుకు వెస్టిండీస్‌తో పోరుకి భారత్ సిద్ధమైంది.

TNN 19 Jun 2017, 9:32 pm
పక్షం రోజులకు పైగా క్రికెట్ అభిమానుల్ని అలరించిన ఛాంపియన్స ట్రోఫీ ముగిసింది. నాలుగు రోజులే విరామం.. మళ్లీ అభిమానుల్ని అలరించేందుకు వెస్టిండీస్‌తో పోరుకి భారత్ సిద్ధమైంది. జూన్ 23 నుంచి కరీబియన్ గడ్డపై టీమిండియా ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడనుంది.
Samayam Telugu india tour of west indies 2017
కరీబియన్ గడ్డపై మ్యాచ్‌లకి భారత్ రెడీ..!


ఆ దేశ బోర్డుతో విభేదాల కారణంగా క్రిస్‌గేల్, బ్రావో, సామి లాంటి సీనియర్ క్రికెటర్లు జట్టుకు పూర్తిగా దూరమైన నేపథ్యంలో యువ క్రికెటర్లు భారత్‌పై ఎలాంటి ప్రదర్శన చేస్తారానోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పేలవ ప్రదర్శనతో పాక్ చేతిలో ఓడిన భారత్ కూడా తిరిగి పుంజుకోవాలని ఆశిస్తోంది.

జూన్ 23న తొలి వన్డే, 25న రెండో వన్డే, 30న మూడో వన్డే, జులై 2న నాలుగో వన్డే, జులై 6న ఐదో వన్డే జరగనుంది. అనంతరం జులై 9న ఏకైక టీ20 మ్యాచ్ జరగనుంది. వన్డే, టెస్టుల్లో వెస్టిండీస్ ప్రదర్శన గత కొంతకాలంగా దిగజారినా.. టీ20ల్లో మాత్రం ఆ జట్టు మెరుగ్గా రాణిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.