భారత్ ఆదివారం జరగనున్న ఏకైక టీ20లో కూడా గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ.. ఏడాదన్నర తర్వాత మళ్లీ విండీస్ జట్టులోకి వచ్చిన విధ్వంసక ఓపెనర్ క్రిస్గేల్ని నిలువరించడం టీమిండియా బౌలర్లకి సవాలే. అతనితో పాటు కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, మార్లోన్ శ్యామూల్స్, బ్రాత్వైట్ చేరికతో ఆ జట్టు ఇప్పుడు పటిష్టంగా తయారైంది. ఈ రోజు రాత్రి 9 గంటలకి మ్యాచ్ జరగనుంది.
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. ఇప్పటి వరకు క్రిస్గేల్ని నిలువరించేందుకు ప్రధాన అస్త్రంగా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ని ఎక్కువగా ప్రయోగించేవాడు. అది ఐసీసీ టోర్నీ అయినా.. ఐపీఎల్లోనైనా అశ్విన్కే తొలుత బంతినిచ్చేవాడు. కానీ.. వెస్టిండీస్తో ఇప్పటికే ముగిసిన వన్డే సిరీస్లో విఫలమైన అశ్విన్ చివరి వన్డేల్లో కనీసం తుది జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో ఏకైక టీ20లో అతని స్థానంపై అనుమానాలు నెలకొన్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లి చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్పైనే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు విభేదాల కారణంగా జట్టుకి దూరమైన క్రిస్గేల్ చాలా రోజుల తర్వాత దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తున్నాడు. దీంతో అతను ఈ మ్యాచ్లో చెలరేగే అవకాశం ఉంది.
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. ఇప్పటి వరకు క్రిస్గేల్ని నిలువరించేందుకు ప్రధాన అస్త్రంగా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ని ఎక్కువగా ప్రయోగించేవాడు. అది ఐసీసీ టోర్నీ అయినా.. ఐపీఎల్లోనైనా అశ్విన్కే తొలుత బంతినిచ్చేవాడు. కానీ.. వెస్టిండీస్తో ఇప్పటికే ముగిసిన వన్డే సిరీస్లో విఫలమైన అశ్విన్ చివరి వన్డేల్లో కనీసం తుది జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో ఏకైక టీ20లో అతని స్థానంపై అనుమానాలు నెలకొన్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లి చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్పైనే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు విభేదాల కారణంగా జట్టుకి దూరమైన క్రిస్గేల్ చాలా రోజుల తర్వాత దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తున్నాడు. దీంతో అతను ఈ మ్యాచ్లో చెలరేగే అవకాశం ఉంది.