యాప్నగరం

మిశ్రాకు గాయం.. కుల్దీప్‌‌కు కలిసొచ్చింది

బంగ్లాతో టెస్టు మ్యాచ్‌ కోసం 22 ఏళ్ల కుల్దీప్‌ యాదవ్‌కు అనూహ్యంగా జట్టులో స్థానం దక్కింది.

TNN 7 Feb 2017, 5:36 pm
బంగ్లాదేశ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అమిత్ మిశ్రా గాయపడటంతో అతడి స్థానంలో కుల్దీప్‌కు అవకాశం లభించింది. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన మిశ్రా.. బంగ్లాతో టెస్టు మ్యాచ్‌కు ముందు తొలి ప్రాక్టీస్ సెషన్‌కు కూడా హాజరు కాలేదు. అతడికి విశ్రాంతి తప్పనిసరి కావడంతో హైదరాబాద్‌లో బంగ్లాతో జరగనున్నఏకైక టెస్టులో కులదీప్ ఆడనున్నాడు. మిశ్రా గాయం కారణంగా అనూహ్యంగా యాదవ్ టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నాడు.
Samayam Telugu india v bangladesh test amit mishra injured kuldeep yadav included
మిశ్రాకు గాయం.. కుల్దీప్‌‌కు కలిసొచ్చింది


ఉత్తర ప్రదేశ్‌కు చెందిన చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కే అవకాశాలున్నాయి. 22 ఏళ్ల కులదీప్ 8 రంజీ మ్యాచ్‌ల్లో 35 వికెట్లు తీయడంతోపాటు 466 రన్స్ చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో ఇండియా -ఎ తరఫున బరిలోకి దిగిన కుల్దీప్ యాదవ్.. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడు.

వాస్తవానికి ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లోనే కుల్దీప్ టీమిండియా తరఫున అరంగేట్రం చేయాల్సింది. టెస్టు సిరీస్‌లో గాయపడిన జయంత్ యాదవ్ స్థానంలో అతణ్ని జట్టులోకి తీసుకుంటారని భావించారు. కానీ జట్టులో స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉన్న కారణంగా కుల్దీప్‌కు చోటు దక్కలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.