విరాట్ సారథ్యంలోని భారత టెస్ట్ క్రికెట్ జట్టు అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. కోహ్లీ టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన నాలుగు సీరీస్ల్లోనూ భారత్ జట్టు విజయం సాధించింది. వీటిలో శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండిస్తోపాటు తాజాగా న్యూజిలాండ్ సీరీస్లు ఉన్నాయి. కోహ్లీ 2014 డిసెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకోవడంతో ఆ మ్యాచ్కు తొలిసారిగా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత జరిగిన టెస్ట్ మ్యాచ్ల్లో కోహ్లీ నాయకత్వంలోని టెస్ట్ జట్టు పదింటిలో విజయం సాధించి, అయిందింటిని డ్రాగా ముగించింది. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓటమి పాలైంది. యువ రక్తంతో భారత టెస్ట్ జట్టు ఉరకలు వేస్తోంది. ఇందుకు వీరి ప్రదర్శనే నిదర్శనం.
సీజన్లో అజింక్య రహానే 59.47 సగటుతో 1132 పరుగులు, కోహ్లీ 43.78 సగటుతో 1007 పరుగులు, ఛటేశ్వర పుజారా 55.85 సగటుతో 782 పరుగులు చేయగా, రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో 101 వికెట్లు, రవీంద్ర జడేజా 40 వికెట్లు సాధించారు. 2014 డిసెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ నుంచి ధోనీ తప్పుకోవడంతో కోహ్లీ కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే 2015 జనవరిలో ధోనీ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. తర్వాత కోహ్లీ పూర్తిస్థాయిలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన సీరీస్కు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. బంగ్లాదేశ్లో జరిగిన ఈ సీరీస్ను భారత్ డ్రాగా ముగించింది. తర్వాత శ్రీలంకతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్లో సీరీస్లో 3-0తో ఇండియా విజయం సాధించింది. దీంతో సొంతగడ్డపై 23 ఏళ్ల తర్వాత తొలి టెస్ట్ సీరీస్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత టెస్ట్ క్రికెట్లో నెంబర్వన్ హోదాతో నాలుగు మ్యాచ్లు అడేందుకు ఇండియాకు వచ్చిన దక్షిణాఫ్రికాను 3-0తో ఓడించింది.
తర్వాత కోహ్లీ నాయకత్వంలోని భారత్ జట్టు కరేబియన్ పర్యటనకు వెళ్లింది. అక్కడ వెస్టిండిస్తో జరిగిన నాలుగు మ్యాచ్ల సీరీస్ను 3-0తో గెలుచుకుంది. ఈ సీరీస్ మొదటి మ్యాచ్లో టెస్టుల్లో కోహ్లీ తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం స్వదేశంలో న్యూజీలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ వరుస విజయాలు సాధించి ఇండియా క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం న్యూజీలాండ్పై సాధించిన విజయంతో 2012 డిసెంబరు నుంచి స్వదేశంలో ఎలాంటి ఓటమి ఎరుగకుండా 13 వ విజయాన్ని ఇండియా నమోదు చేసింది. వచ్చే కొద్ది మాసాల్లో ఇంగ్లాండు, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో జరిగే సీరీస్ల్లో ఇండియా పాల్గోంటుంది. 1977 నుంచి 80 మధ్య స్వదేశంలో 20 విజయాలు సాధించిన భారత జట్టు రికార్డును కోహ్లీ సేన తిరగరాస్తుందో లేదో ఇంకొంత కాలం వేచి చూడాలి.
సీజన్లో అజింక్య రహానే 59.47 సగటుతో 1132 పరుగులు, కోహ్లీ 43.78 సగటుతో 1007 పరుగులు, ఛటేశ్వర పుజారా 55.85 సగటుతో 782 పరుగులు చేయగా, రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో 101 వికెట్లు, రవీంద్ర జడేజా 40 వికెట్లు సాధించారు. 2014 డిసెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ నుంచి ధోనీ తప్పుకోవడంతో కోహ్లీ కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే 2015 జనవరిలో ధోనీ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. తర్వాత కోహ్లీ పూర్తిస్థాయిలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన సీరీస్కు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. బంగ్లాదేశ్లో జరిగిన ఈ సీరీస్ను భారత్ డ్రాగా ముగించింది. తర్వాత శ్రీలంకతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్లో సీరీస్లో 3-0తో ఇండియా విజయం సాధించింది. దీంతో సొంతగడ్డపై 23 ఏళ్ల తర్వాత తొలి టెస్ట్ సీరీస్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత టెస్ట్ క్రికెట్లో నెంబర్వన్ హోదాతో నాలుగు మ్యాచ్లు అడేందుకు ఇండియాకు వచ్చిన దక్షిణాఫ్రికాను 3-0తో ఓడించింది.
తర్వాత కోహ్లీ నాయకత్వంలోని భారత్ జట్టు కరేబియన్ పర్యటనకు వెళ్లింది. అక్కడ వెస్టిండిస్తో జరిగిన నాలుగు మ్యాచ్ల సీరీస్ను 3-0తో గెలుచుకుంది. ఈ సీరీస్ మొదటి మ్యాచ్లో టెస్టుల్లో కోహ్లీ తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం స్వదేశంలో న్యూజీలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ వరుస విజయాలు సాధించి ఇండియా క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం న్యూజీలాండ్పై సాధించిన విజయంతో 2012 డిసెంబరు నుంచి స్వదేశంలో ఎలాంటి ఓటమి ఎరుగకుండా 13 వ విజయాన్ని ఇండియా నమోదు చేసింది. వచ్చే కొద్ది మాసాల్లో ఇంగ్లాండు, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో జరిగే సీరీస్ల్లో ఇండియా పాల్గోంటుంది. 1977 నుంచి 80 మధ్య స్వదేశంలో 20 విజయాలు సాధించిన భారత జట్టు రికార్డును కోహ్లీ సేన తిరగరాస్తుందో లేదో ఇంకొంత కాలం వేచి చూడాలి.