భారత్తో బెంగళూరు వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో రెండో రోజైన శుక్రవారం.. ఆట ఆరంభంలోనే అఫ్గానిస్థాన్ వికెట్ పడగొట్టింది. ఓవర్నైట్ స్కోరు 347/6తో ఈరోజు ఆట కొనసాగించిన భారత జట్టు 369 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఫాస్ట్ బౌలర్ అహ్మదజాయ్ ఆఫ్ స్టంప్కి వెలుపలగా విసిరిన బంతిని ప్లిక్ చేయబోయి రవిచంద్రన్ అశ్విన్ (18: 39 బంతుల్లో 1x4) వికెట్ కీపర్ జజాయ్ చేతికి చిక్కాడు.
బ్యాట్కి ఇన్సైడ్ ఎడ్జ్లో తగిలిన బంతి నేలను తాకుతున్న ఆఖరి క్షణంలో కీపర్ అందుకోవడంతో.. క్యాచ్పై అనుమానం వ్యక్తం చేసిన ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కి నివేదించారు. రిప్లైలో కీపర్ సేఫ్గానే బంతిని అందుకున్నట్లు తేలింది. దీంతో.. అశ్విన్ నిరాశగా పెవిలియన్ బాట పట్టగా.. అనంతరం వచ్చిన రవీంద్ర జడేజా క్యాచ్ని కీపర్ నేలపాలు చేశాడు. జడేజాతో పాటు హార్దిక్ పాండ్య (37: 57 బంతుల్లో 6x4) ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు.
బ్యాట్కి ఇన్సైడ్ ఎడ్జ్లో తగిలిన బంతి నేలను తాకుతున్న ఆఖరి క్షణంలో కీపర్ అందుకోవడంతో.. క్యాచ్పై అనుమానం వ్యక్తం చేసిన ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కి నివేదించారు. రిప్లైలో కీపర్ సేఫ్గానే బంతిని అందుకున్నట్లు తేలింది. దీంతో.. అశ్విన్ నిరాశగా పెవిలియన్ బాట పట్టగా.. అనంతరం వచ్చిన రవీంద్ర జడేజా క్యాచ్ని కీపర్ నేలపాలు చేశాడు. జడేజాతో పాటు హార్దిక్ పాండ్య (37: 57 బంతుల్లో 6x4) ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు.