యాప్నగరం

హాఫ్ సెంచరీ బాదిన రాయుడు ఔట్..!

అఫ్గానిస్థాన్‌తో ఈ మ్యాచ్‌ నామమాత్రమే కావడంతో టీమిండియా మేనేజ్‌మెంట్ కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లకి విశ్రాంతినిచ్చింది. దీంతో.. ఓపెనర్లుగా వచ్చిన కేఎల్ రాహుల్, అంబటి రాయుడు చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు.

Samayam Telugu 25 Sep 2018, 10:41 pm
ఆసియా కప్‌ సూపర్-4లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో ఈరోజు జరుగుతున్న మ్యాచ్‌లో 253 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టుకి శుభారంభం లభించింది. ఓపెనర్లు అంబటి రాయుడు (57: 49 బంతుల్లో 4x4, 4x6), కేఎల్ రాహుల్ (50 నాటౌట్: 55 బంతుల్లో 4x4, 1x6) అర్ధ శతకాలు బాదడంతో భారత్ జట్టు 17.1 ఓవర్లు ముగిసే సమయానికి 112/1తో మెరుగైన స్థితిలో నిలిచింది. విజయానికి ఇంకా 139 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో 9 వికెట్ల ఉండటంతో భారత్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్‌కి చేరనుంది.
Samayam Telugu india vs afghanistan lokesh rahul ambati rayudu hit fifties as india cruise
హాఫ్ సెంచరీ బాదిన రాయుడు ఔట్..!


అఫ్గానిస్థాన్‌తో ఈ మ్యాచ్‌ నామమాత్రమే కావడంతో టీమిండియా మేనేజ్‌మెంట్ కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లకి విశ్రాంతినిచ్చింది. దీంతో.. ఓపెనర్లుగా వచ్చిన కేఎల్ రాహుల్, అంబటి రాయుడు చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఆరంభం నుంచే స్వేచ్ఛగా అఫ్గానిస్థాన్ బౌలర్లని ఎదుర్కొన్న ఈజోడి తొలి వికెట్‌కి ఏకంగా 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలోనే రాయుడు తన 8వ వన్డే అర్ధశతకాన్ని పూర్తి చేసుకుని ఔటవగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ కూడా కెరీర్‌ రెండో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.