యాప్నగరం

ind vs aus: ముగిసిన మూడో రోజు ఆట.. పట్టు బిగిస్తోన్న భారత్

అడిలైడ్ టెస్టుపై భారత్ క్రమంగా పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

Samayam Telugu 8 Dec 2018, 3:09 pm
అడిలైడ్ టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 151/3తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకోవడంతో భారత్‌ 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో 150 పరుగులు చేస్తే.. అడిలైడ్ టెస్టుపై భారత్ పట్టు బిగించే అవకాశం ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 191/7తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా 235 పరుగులకే ఆలౌటైంది.
Samayam Telugu lyon kohli


పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో మూడో రోజు 71.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులకే ఔటైన కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్నాడు. దూకుడుగా ఆడిన రాహుల్ 67 బంతుల్లో 44 పరుగులు చేశాడు. దీంతో భారత్ తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించింది. మురళీ విజయ్ (18) మరోసారి నిరాశపరిచాడు.

ఈ దశలో ఛటేశ్వర్ పుజారా (127 బంతుల్లో 40 బ్యాటింగ్ ), విరాట్ కోహ్లి (104 బంతుల్లో 34) భారత్ ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టారు. ఓపికగా ఆడుతూ.. మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. మరికాసేపట్లో మూడో రోజు ఆట ముగుస్తుందనగా.. లియాన్ బౌలింగ్‌లో కోహ్లి అవుటయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పుజారాతోపాటు రహానే (1) క్రీజులో ఉన్నాడు.

కోహ్లికి లియాన్ గండం..
ఈ మ్యాచ్‌లో కోహ్లిని అవుట్ చేయడం ద్వారా టెస్టుల్లో కోహ్లిని ఎక్కువసార్లు బుట్టలో వేసుకున్న బౌలర్‌గా లియాన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. లియాన్ కోహ్లిని ఆరుసార్లు ఔట్ చేయగా.. అండర్సర్, స్టువర్ట్ బ్రాడ్ ఐదుసార్ల చొప్పున విరాట్‌ను ఔట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.