యాప్నగరం

IND vs AUS 2nd ODI ముంగిట భారత్‌కి గాయం దెబ్బ.. కేఎల్ రాహుల్ చేతికి మళ్లీ గ్లోవ్స్

ఆస్ట్రేలియాతో రెండో వన్డే ముంగిట భారత్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం జరిగే రెండో వన్డేకి దూరంగా ఉండనున్నాడు. మంగళవారం వాంఖడేలో జరిగిన తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తూ రిషబ్ పంత్ గాయపడగా.. అతని స్థానంలో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేసిన విషయం తెలిసిందే. ముంబయి నుంచి రాజ్‌కోట్‌కి ఈరోజు టీమిండియా బయల్దేరగా.. రిషబ్ పంత్ మాత్రం అక్కడే ఉండిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

Samayam Telugu 15 Jan 2020, 6:30 pm
ఆస్ట్రేలియాతో రెండో వన్డే ముంగిట భారత్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం జరిగే రెండో వన్డేకి దూరంగా ఉండనున్నాడు. మంగళవారం వాంఖడేలో జరిగిన తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తూ రిషబ్ పంత్ గాయపడగా.. అతని స్థానంలో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేసిన విషయం తెలిసిందే. ముంబయి నుంచి రాజ్‌కోట్‌కి ఈరోజు టీమిండియా బయల్దేరగా.. రిషబ్ పంత్ మాత్రం అక్కడే ఉండిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
Samayam Telugu india vs australia 2nd odi rishabh pant not travelling with team india to rajkot
IND vs AUS 2nd ODI ముంగిట భారత్‌కి గాయం దెబ్బ.. కేఎల్ రాహుల్ చేతికి మళ్లీ గ్లోవ్స్


అంపైర్ ఔటివ్వకపోయినా

తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ విసిరిన షార్ట్ పిచ్ బంతిని ఫుల్ చేయబోయిన రిషబ్ పంత్ గాయపడ్డాడు. అతని బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి అలానే వెనక్కి వెళ్లి హెల్మెట్‌‌ని బలంగా తాకి పాయింట్‌లో గాల్లోకి లేచింది. దీంతో.. అక్కడే ఫీల్డింగ్ చేస్తూ టర్నర్ సులువుగా ఆ బంతిని క్యాచ్ రూపంలో అందుకున్నాడు. బంతి బ్యాట్‌కి తాకలేదని భ్రమించిన ఫీల్డ్ అంపైర్ తొలుత నాటౌట్ ఇచ్చినా.. రిషబ్ పంత్ మాత్రం రిప్లైని చూస్తూ పెవిలియన్‌కి నడిచాడు.

పంత్‌‌ కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మనీశ్ పాండే.. కానీ కీపర్‌గా రాహుల్

పెవిలియన్‌కి వెళ్లిన రిషబ్ పంత్‌ని తొలుత వైద్యులు పరీక్షించారు. బంతి బలంగా హెల్మెట్‌కి తాకడంతో అతడి తల అదిరినట్లు గుర్తించి.. కొన్ని గంటలు పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. దీంతో.. రిషబ్ పంత్ మ్యాచ్‌లో వికెట్ కీపింగ్‌కి రాలేదు. అతని స్థానంలో మనీశ్ పాండేని కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా టీమిండియా తీసుకోగా.. కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతల్ని నిర్వర్తించాడు.

శుక్రవారమే రెండో వన్డే

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుండగా.. వాంఖడే వన్డేలో 10 వికెట్ల తేడాతో గెలుపొందిన కంగారూలు 1-0తో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో.. రెండో వన్డేలో గెలవడం ద్వారా సిరీస్‌ని సమం చేయాలని టీమిండియా ఆశిస్తోంది. అయితే.. కీలక మ్యాచ్‌కి పంత్‌ దూరమవుతుండగా.. అతని స్థానంలో మనీశ్ పాండేని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.