యాప్నగరం

ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో భారత్ ఓటమిపై విరాట్ కోహ్లీ స్పందన

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ల దెబ్బకి జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ లాంటి అగ్రశ్రేణి బౌలర్లే తేలిపోవడంతో.. ఆఖరికి మయాంక్ అగర్వాల్ చేతికి కెప్టెన్ కోహ్లీ బంతినివ్వాల్సి వచ్చింది.

Samayam Telugu 29 Nov 2020, 8:25 pm
ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో వన్డేలో భారత్ జట్టు పేలవరీతిలో పరాజయాన్ని చవిచూసింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో తొలుత బౌలింగ్‌లో తడబడిన టీమిండియా.. కంగారూలకి ఏకంగా 389 పరుగులు సమర్పించుకుంది. అనంతరం ఛేదన ఆఖర్లో వరుస వికెట్లు చేజార్చుకున్న భారత్ 338/9కే పరిమితమైంది. దాంతో.. 51 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా టీమ్.. మూడు వన్డేల సిరీస్‌ని 2-0తో చేజార్చుకోగా.. నామమాత్రమైన చివరి వన్డే కాన్‌బెర్రా వేదికగా బుధవారం ఉదయం జరగనుంది.
Samayam Telugu Virat Kohli
Australia's Josh Hazlewood celebrates after taking the wicket of Virat Kohli caught by Moises Henriques with teammates. (Reuters Photo)


టీమిండియా ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ‘‘మ్యాచ్‌లో మేము బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయాం. మా బౌలర్లు ఆశించిన ప్లేస్‌లో బంతుల్ని విసరలేకపోయారు. దాంతో.. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన ఆస్ట్రేలియా.. సొంతగడ్డపై దూకుడుగా ఆడేసింది. ఫీల్డింగ్‌లోనూ ఆ జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది’’ అని వెల్లడించాడు.

భారత బౌలింగ్ విభాగంలో హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా మినహా.. మిగిలిన ఐదుగురు బౌలర్లూ ఓవర్‌కి కనీసం 7.90 చొప్పున పరుగులు సమర్పించుకున్నారు. భారీ అంచనాలతో మ్యాచ్‌ ఆడిన నవదీప్ సైనీ 7 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 70 పరుగులు ఇవ్వగా.. బుమ్రా 10 ఓవర్లకి 79 రన్స్, షమీ 9 ఓవర్లకి 73 పరుగులిచ్చాడు. దాంతో.. మయాంక్ అగర్వాల్‌, హార్దిక్ పాండ్యాతోనూ కోహ్లీ బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. దాదాపు ఏడాది తర్వాత హార్దిక్ పాండ్యా మళ్లీ బౌలింగ్ చేస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.