యాప్నగరం

India vs Australia 2nd Test: పెర్త్ టెస్టులో ఓటమి దిశగా భారత్..!

భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) క్లీన్‌బౌల్డవగా.. తొలి టెస్టులో శతకం బాదిన చతేశ్వర్ పుజారా (4) జట్టు స్కోరు 13వద్దే ఔటైపోయాడు

Samayam Telugu 17 Dec 2018, 4:13 pm
ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు ఓటమి దిశగా వెళ్తోంది. ఆటలో నాలుగో రోజైన సోమవారం ఆస్ట్రేలియా జట్టుని రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకి కుప్పకూల్చిన టీమిండియా.. ఆ తర్వాత 287 లక్ష్య ఛేదనలో ఈరోజు ఆట ముగిసే సమయానికి 112/5తో నిలిచింది. క్రీజులో తెలుగు క్రికెటర్ హనుమ విహారి (24 బ్యాటింగ్: 58 బంతుల్లో 4x4), రిషబ్ పంత్ (9 బ్యాటింగ్: 19 బంతుల్లో) ఉండగా.. విజయానికి ఇంకా 175 పరుగులు చేయాల్సి ఉంది. బ్యాటింగ్‌కి అతికష్టంగా మారిన పెర్త్ పిచ్‌పై మంగళవారం మూడు సెషన్ల పాటు భారత్ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
Samayam Telugu 72


undefined
భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) క్లీన్‌బౌల్డవగా.. తొలి టెస్టులో శతకం బాదిన చతేశ్వర్ పుజారా (4) జట్టు స్కోరు 13వద్దే ఔటైపోయాడు. దీంతో.. స్కోరు బోర్డుని నడిపించే బాధ్యత తీసుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ (17: 40 బంతుల్లో 2x4) కాసేపు నిలకడగా ఆడినా.. జట్టు స్కోరు 48 వద్ద స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో అతనూ ఔటైపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ మురళీ విజయ్ (20: 67 బంతుల్లో 3x4), అజింక్య రహానె (30: 47 బంతుల్లో 2x4, 1x6) కూడా పెవిలియన్ చేరడంతో భారత్‌ జట్టు కష్టాల్లో పడింది.
ఈరోజు తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయిన భారత్.. రెండో సెషన్ మాత్రం అద్భుతంగా పుంజుకుంది. జట్టు స్కోరు 192 వద్ద ఆసీస్ కెప్టెన్ టిమ్‌పైన్ (37: 116 బంతుల్లో 4x4) ఔటవగా.. నిన్న గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ తీసుకున్న అరోన్ ఫించ్ (25: 31 బంతుల్లో 5x4) ఈరోజు మళ్లీ బ్యాటింగ్‌కి వచ్చి ఎదుర్కొన్న తొలి బంతికే ఔటైపోయాడు. ఈ దశలో దూకుడు పెంచేందుకు ప్రయత్నించిన ఉస్మాన్ ఖవాజా (72: 213 బంతుల్లో 5x4) కూడా కీపర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ ముగ్గురినీ మహ్మద్ షమీ వరుస ఓవర్లలో పెవిలియన్ బాట పట్టించడం విశేషం. ఆ తర్వాత పాట్ కమిన్స్ (1), మిచెల్ స్టార్క్ (14), నాథన్ లయన్ (5) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ (6/56) అత్యుత్తమ ప్రదర్శన కనబర్చగా.. జస్‌ప్రీత్ బుమ్రా (3/39), ఇషాంత్ శర్మ (1/45) అతనికి సహకారం అందించారు.
శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకి ఆలౌటవగా.. భారత్ జట్టు 283 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో.. ఆసీస్‌కి 43 పరుగుల ఆధిక్యం లభించింది. అడిలైడ్ వేదికగా గత వారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు 31 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.