యాప్నగరం

విరాట్ కోహ్లీ శతకం.. భారత్ 283కి ఆలౌట్

ఈరోజు తొలి సెషన్ ఆరంభ ఓవర్‌లోనే భారత్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేసేందుకు రహానె ప్రయత్నించగా.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా కీపర్ టిమ్‌పైన్ చేతుల్లోకి వెళ్లిపోయింది.

Samayam Telugu 16 Dec 2018, 11:35 am
ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకి ఆలౌటైంది. ఆటలో మూడోరోజైన ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 172/3‌తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టులో విరాట్ కోహ్లీ (123: 257 బంతుల్లో 13x4, 1x6) శతకం బాదినా.. మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, టెయిలెండర్లు నిరాశపరచడంతో భారత్ జట్టు 105.5 ఓవర్లలో 283 పరుగులకే పరిమితమైంది. దీంతో.. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసిన ఆస్ట్రేలియాకి 43 పరుగుల ఆధిక్యం లభించింది. కోహ్లీతో పాటు అజింక్య రహానె (51: 105 బంతుల్లో 6x4, 1x6) అర్ధశతకంతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
Samayam Telugu 100


ఈరోజు తొలి సెషన్ ఆరంభ ఓవర్‌లోనే భారత్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేసేందుకు రహానె ప్రయత్నించగా.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా కీపర్ టిమ్‌పైన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో.. జట్టు స్కోరు 173 వద్దే భారత్ 4వ వికెట్ చేజార్చుకుంది. ఆ తర్వాత వచ్చిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి (20: 46 బంతుల్లో 2x4) కాసేపు క్రీజులో నిలిచినా.. జట్టు జట్టు స్కోరు 233 వద్ద అతనూ ఔటైపోయాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌కి వెలుపల పడిన బంతిని వెంటాడి కీపర్ టిమ్‌పైన్ చేతికి అతను చిక్కాడు.

ఈ దశలో కాసేపు దూకుడుగా ఆడిన విరాట్ కోహ్లి 251 వద్ద అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా ఔటవడంతో.. భారత్ జట్టు మళ్లీ ఒత్తిడిలో పడింది. ఒక ఎండ్‌లో రిషబ్ పంత్ (36: 50 బంతుల్లో 2x4, 1x6) క్రీజులో నిలిచినా.. మహ్మద్ షమీ (0), ఇషాంత్ శర్మ (1), ఉమేశ్ యాదవ్ (4 నాటౌట్), జస్‌ప్రీత్ బుమ్రా (4) తేలిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.