యాప్నగరం

వికెట్ల వేటలో జోరుమీదున్న భారత బౌలర్లు

ధర్మశాల టెస్టులో మూడో రోజు భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. టీ విరామ సమయానికే ఐదు కీలక వికెట్లు తీసి ఆసీస్ టాప్ ఆర్డర్ వెన్ను విరిచారు.

TNN 27 Mar 2017, 2:57 pm
ధర్మశాల టెస్టులో మూడో రోజు భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. టీ విరామ సమయానికే ఐదు కీలక వికెట్లు తీసి ఆసీస్ టాప్ ఆర్డర్ వెన్ను విరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేసిన ఆసీస్ మలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే 6 వికెట్లు నష్టపోయింది. కొత్త బంతితో భారత పేసర్లు చెలరేగిపోయారు. ఈ సిరీస్‌లో పేలవ ఆటతీరు కనబరుస్తోన్న ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ధర్మశాల టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు. ఓపెనర్లను ఇద్దరినీ ఉమేశ్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు.
Samayam Telugu india vs australia australia dented by regular strikes
వికెట్ల వేటలో జోరుమీదున్న భారత బౌలర్లు


తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను భువనేశ్వర్ కుమార్ బౌల్డ్ చేశాడు. రాంచీ టెస్టు డ్రాగా ముగిసేందుకు కారణమైన పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ను అశ్విన్ అవుట్ చేశాడు. అశ్విన్ వేసిన ఊరించే బంతిని ఆడే క్రమంలో హ్యాండ్స్‌కాంబ్ స్లిప్‌లో ఉన్న రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. షాన్ మార్ష్‌ను జడేజా పెవిలియన్ చేర్చాడు.

మాథ్యూ వేడ్ 6 రన్స్‌తో క్రీజులో ఉండగా, 45 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌ను అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆసీస్ రివ్యూ కోరినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరి సెషన్లో మరో రెండు వికెట్లు తీస్తే మ్యాచ్ దాదాపుగా భారత్ చేతుల్లోకి వచ్చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి ఆసీస్ ఆధిక్యం 74 పరుగులు మాత్రమే కాబట్టి మరో 60 పరుగుల్లోగా మిగతా బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపితే ధర్మశాలలో రహానే సేన విజయం సాధించడం ఖాయం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.