యాప్నగరం

ఆస్ట్రేలియా కవ్విస్తే.. భారత్‌ కూడా రెడీ: కోహ్లీ

ఆస్ట్రేలియా పర్యటనలో ఆట తప్ప.. అనవసర విషయాల జోలికి వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. కానీ.. వాళ్లు కవ్వింపులకి దిగుతూ.. గొడవలకి ప్రయత్నిస్తే..?

Samayam Telugu 15 Nov 2018, 6:05 pm
ఆస్ట్రేలియా ఆటగాళ్లు కవ్వింపులకి దిగితే తాము కూడా ధీటుగా బదులిస్తామని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియా ఈరోజు భారత్ నుంచి బయల్దేరుతున్న నేపథ్యంలో కోహ్లీ పైవ్యాఖ్యలు చేశాడు. ఈ నెల 21న తొలి టీ20 మ్యాచ్‌తో సుదీర్ఘ సిరీస్‌ని ఆరంభించనున్న భారత్ వచ్చే ఏడాది జనవరి 18 వరకూ అక్కడే ఉండనుంది.
Samayam Telugu c96a56c935e692c14e80b5e031233973.


సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, నాలుగు టెస్టులతో పాటు మూడు వన్డేల్లో టీమిండియా తలపడనుంది. ఇప్పటి వరకూ భారత్ జట్టు ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా ఆ గడ్డపై గెలవలేదు. దీంతో.. కనీసం ఈసారైనా.. ఈ నిరీక్షణకి తెరదించాలని భారత్ జట్టు ఆశిస్తోంది.

‘ఆస్ట్రేలియా పర్యటనలో ఆట తప్ప.. అనవసర విషయాల జోలికి వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. కానీ.. వాళ్లు కవ్వింపులకి దిగుతూ.. గొడవలకి ప్రయత్నిస్తే..? మేము కూడా అదే విధంగా బదులిస్తాం. ఇప్పుడు క్రికెట్‌ పోకడ కూడా అలానే ఉంది. కానీ.. మేము సాధ్యమైనంత వరకూ పర్యటనలో వారికి పోటీనిస్తూ.. ఆటపైనే దృష్టి నిలిపేందుకు ప్రయత్నిస్తాం’ అని కోహ్లీ వెల్లడించాడు.

భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, చాహల్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్

భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానే, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.