యాప్నగరం

వారెవ్వా.. విజయానికి 8 వికెట్ల దూరంలో భారత్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రాంచీలో జరుగుతున్న మూడో టెస్టును ఖాతాలో వేసుకోవడానికి భారత్ ఉవ్విళ్లూరుతోంది.

TNN 19 Mar 2017, 4:55 pm
రాంచీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రాంచీలో జరుగుతున్న మూడో టెస్టును ఖాతాలో వేసుకోవడానికి భారత్ ఉవ్విళ్లూరుతోంది. పుజారా, సాహా అద్భుత బ్యాటింగ్‌తో 603/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా.. నాలుగో రోజు ముగిసే సమయానికి రెండు వికెట్లు తీసింది. భారత్ విజయం సాధించాలంటే.. మరో 8 వికెట్లు అవసరం కాగా, ఆసీస్ 129 పరుగులు వెనుకబడింది. ఏడో వికెట్‌కు 199 పరుగుల రికార్డు స్థాయి భాగస్వామ్యం నెలకొల్పిన పుజారా, సాహా వెనువెంటనే అవుటైనప్పటికీ.. జడేజా 55 బంతుల్లో 54 పరుగులు చేయడంతో భారత్ 603 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
Samayam Telugu india vs australia india needs 8 wickets to win in ranchi test
వారెవ్వా.. విజయానికి 8 వికెట్ల దూరంలో భారత్


ఆసీస్ మలి ఇన్నింగ్స్‌లో 7.2 ఓవర్లు మాత్రమే ఆడినప్పటికీ.. 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 14 రన్స్ చేసిన వార్నర్‌ను పెవలియన్‌కు పంపిన జడేజా.. రెండు పరుగులు చేసిన నాథన్ లియాన్‌ను కూడా బుట్టలో వేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. మరో ఓపెనర్ రెన్‌షా ఏడు పరుగులతో క్రీజులో ఉన్నాడు.

అంతకు ముందు రికార్డు స్థాయిలో 525 బంతులు ఎదుర్కొన్న పుజారా 202 పరుగులు చేసి అవుటయ్యాడు. ఓ ఇన్నింగ్స్‌లో 500కి పైగా బంతుల్ని ఎదుర్కొన్న తొలి భారత బ్యాట్స్‌మెన్ పుజారా కావడం విశేషం. ఈ క్రమంలో చటేశ్వర్ 400 బంతుల్ని డాట్ బాల్స్‌గా వదిలేశాడంటే.. ఆసీస్ బౌలర్లను ఏ స్థాయిలో విసిగించాడో అర్థం చేసుకోవచ్చు. పుజారాకు సాహా తోడవడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. తొలి రెండు టెస్టుల్లో.. నాలుగు ఇన్నింగ్స్ కలిపి 675 పరుగులు చేసిన టీమిండియా.. ఒకే ఇన్నింగ్స్‌లో 603 రన్స్ చేయడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.