యాప్నగరం

కోహ్లీని మా బౌలర్లు కట్టడి చేయగలరు: టిమ్‌

మైదానంలో భారత్‌పై కవ్వింపులకి దిగడం అనేది జరగకపోవచ్చు. ఎందుకంటే.. అలా వ్యవహరించే సమయంలో భావోద్వేగాలు అదుపు తప్పే ప్రమాదం ఉంది. అందుకే.. గీత దాటకుండా ఉండటమే ఉత్తమం -టిమ్‌పైన్

Samayam Telugu 2 Dec 2018, 4:02 pm
ఆస్ట్రేలియా గడ్డపై గురువారం నుంచి ప్రారంభంకానున్న టెస్టు సిరీస్‌లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీని కట్టడి చేయగల సామర్థ్యం ఆసీస్ బౌలర్లకి ఉందని ఆ జట్టు కెప్టెన్ టిమ్‌పైన్ ధీమా వ్యక్తం చేశాడు. 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో 4 శతకాలు బాదిన విరాట్ కోహ్లి అసాధారణ రీతిలో 694 పరుగులు సాధించాడు. అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు కోహ్లీ మరింత భీకర ఫామ్‌లో ఉండటంతో ఆస్ట్రేలియా బౌలర్లకి తిప్పలు తప్పవని మాజీ క్రికెటర్లు జోస్యం చెప్తున్నారు. ఆసీస్ టెస్టు జట్టులో ప్రస్తుతం మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌ పీటర్‌ సిడిల్‌, హేజిల్‌వుడ్‌ రూపంలో అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు.
Samayam Telugu 00


‘ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు పూర్తి నైపుణ్యంతో ఆడితే.. కచ్చితంగా సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఇబ్బందుల్లోకి నెట్టగలరు. ఇక మైదానంలో భారత్‌పై కవ్వింపులకి దిగడం అనేది జరగకపోవచ్చు. ఎందుకంటే.. అలా వ్యవహరించే సమయంలో భావోద్వేగాలు అదుపు తప్పే ప్రమాదం ఉంది. అందుకే.. గీత దాటకుండా ఉండటమే ఉత్తమం. ఒకవేళ మేము దూకుడుగా వ్యవహరిస్తే.. ప్రతి స్పందన కూడా అలానే వస్తుందని మాకు తెలుసు. కాబట్టి.. సాధ్యమైనంత వరకూ సైలెంట్‌గా ఉండి.. మైదానంలో మా వ్యూహాల్ని అమలు చేస్తాం’ అని టిమ్‌పైన్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.