యాప్నగరం

శతకం బాదిన సాహా, పుజారా డబుల్ సెంచరీ

రాంచీ టెస్టు పుజారా డబుల్ సెంచరీ సాధించగా, సాహా శతకం బాదాడు.

TNN 19 Mar 2017, 3:04 pm
రాంచీ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ హవా కొనసాగుతోంది. సాహా సెంచరీ సాధించగా, పుజారా డబుల్ సెంచరీ బాదాడు. సాహా 214 బంతుల్లో సెంచరీ సాధించగా.. పుజారా డబుల్ సెంచరీ చేయడానికి 521 బంతులను ఎదుర్కోవడం విశేషం. ఇది పుజారాకు మూడో డబుల్ సెంచరీ కావడం గమనార్హం. ఆసీస్‌పై పుజారాకు ఇది రెండో డబుల్ సెంచరీ కాగా, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 11వది. ఈ ద్విశతకంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్‌మెన్ విజయ్ మర్చెంట్ రికార్డును పుజారా సమం చేశాడు.
Samayam Telugu india vs australia saha ton and pujara double ton helps india in strong positon
శతకం బాదిన సాహా, పుజారా డబుల్ సెంచరీ



టెస్టుల్లో మూడో సెంచరీ సాధించిన సాహా.. టెస్టు క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన భారత వికెట్ కీపర్ల జాబితాలో సాహా రెండో స్థానానికి చేరుకున్నాడు. ధోనీ ఆరు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. పుజారా, సాహా కలిసి భారత్ తరఫున ఏడో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే.


డబుల్ సెంచరీ సాధించే క్రమంలో పుజారా అనేక రికార్డులు బద్దలుకొట్టాడు. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతుల్ని ఎదుర్కొన్న భారత్ బ్యాట్స్‌మెన్‌గా ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడంతోపాటు.. భారత గడ్డ మీద ఎక్కువ బంతులు ఆడిన బ్యాట్స్‌మెన్‌గానూ రికార్డు నెలకొల్పాడు. 2005లో జరిగిన బెంగళూరు టెస్టులో యూనిస్ ఖాన్ 504 బంతులు ఎదుర్కొన్నాడు.

686 నిమిషాలపాటు ఓపికగా క్రీజులో నిలబడి 525 బంతులను ఎదుర్కొన్న పుజారా (202) నాథన్ లియాన్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 199 పరుగుల ఏడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత కాసేటికే సాహా (117) ఒకీఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 196.1 ఓవర్లు ముగిసే సరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 541 పరుగులు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.