యాప్నగరం

​ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి ధావన్ దూరం

ఆస్ట్రేలియాతో ఆదివారం నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌కి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమయ్యాడు.

TNN 14 Sep 2017, 3:38 pm
ఆస్ట్రేలియాతో ఆదివారం నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌కి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమయ్యాడు. అతని భార్యకి అనారోగ్యంగా ఉండటంతో ధావన్ అభ్యర్థన మేరకు తొలి మూడు వన్డేలకి ఎంపిక చేసిన జట్టు నుంచి ఈ ఓపెనర్‌‌‌ని తప్పించినట్లు బీసీసీఐ గురువారం వెల్లడించింది. ఇటీవల శ్రీలంకతో ముగిసిన సుదీర్ఘ సిరీస్‌లో కూడా చివరి వన్డేకి ముందు ధావన్ తల్లి ఆరోగ్యం విషమించడంతో హూటాహుటిన అతను భారత్‌కి వచ్చేసిన విషయం తెలిసిందే. దీంతో శ్రీలంకపై చివరి వన్డేతో పాటు, ఏకైక టీ20 మ్యాచ్‌కి కూడా ధావన్ దూరమయ్యాడు.
Samayam Telugu india vs australia shikhar dhawan to miss first three odis to be with unwell wife
​ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి ధావన్ దూరం


‘ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ కోసం తొలి మూడు వన్డేలకి ఎంపిక చేసిన భారత జట్టు నుంచి ఓపెనర్ శిఖర్ ధావన్‌‌ని అతని అభ్యర్థన మేరకు తప్పించాం. తన భార్యకి ఆరోగ్యం సరిగాలేకపోవడంతో ధానవ్ ఈ అభ్యర్థన కోరాడు. జట్టులో 16 మంది క్రికెటర్లు ఇప్పటికే ఉండటంతో అతని స్థానంలో కొత్తగా ఎవరినీ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శిఖర్ ధావన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. శ్రీలంకతో టెస్టులు, వన్డేల్లోనూ శతకాలు బాది జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న గబ్బర్‌కి ఆస్ట్రేలియాపై మెరుగైన రికార్డు ఉంది. తొలి వన్డే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం జరగనుంది. శిఖర్ ధావన్ స్థానంలో అజింక్య రహానె ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.