యాప్నగరం

Shikhar Dhawanని హెచ్చరించిన గవాస్కర్

టీ20 ప్రపంచకప్‌ ముంగిట ఓపెనర్ శిఖర్ ధావన్ పేలవ ఫామ్‌ టీమిండియాలో కంగారు పెంచుతోంది. ఎడమచేతి వాటం ఓపెనర్ కావడంతో.. ప్రస్తుతానికి ఎవరూ ప్రత్యామ్నాయం కూడా కనిపించడం లేదు. కానీ..?

Samayam Telugu 5 Nov 2019, 2:45 pm
భారత జట్టు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌పై వేటు కత్తి వేలాడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గత ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 42 బంతులాడిన ధావన్ 41 పరుగులు చేసి పేలవంగా రనౌటయ్యాడు. ఓపెనర్‌గా వచ్చిన ధావన్ 15 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా.. కేవలం మూడు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే బాదగలిగాడు. దీంతో.. టీమ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచినా.. అతని ఇన్నింగ్స్‌కి విలువ లేకుండా పోయింది. మిగిలిన రెండు టీ20ల్లోనూ ధావన్ ఇదే తరహాలో ఆడితే..? జట్టులో స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పరోక్షంగా హెచ్చరించాడు.
Samayam Telugu New Delhi: Indian batsman Shikhar Dhawan leaves the field after being dismissed ...
Shikhar Dhawan


Read More: కెప్టెన్సీ తప్పిదాన్ని ఒప్పుకున్న రోహిత్ శర్మ
భారత టెస్టు జట్టులో ఇప్పటికే స్థానం కోల్పోయిన శిఖర్ ధావన్.. వరల్డ్ కప్ తర్వాత వన్డే, టీ20ల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించడం లేదు. బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో బంతిని మిడిల్ చేసేందుకు తొలి పవర్ ప్లేలో ఆపసోపాలు పడిన ఈ సీనియర్ ఓపెనర్.. 10వ ఓవర్ తర్వాత బ్యాట్ ఝళిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో స్పిన్నర్ల బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి మరీ షాట్స్ ఆడాడు. కానీ.. కీలక సమయంలో రిషబ్ పంత్‌తో సమన్వయ లోపం కారణంగా ధావన్ రనౌటయ్యాడు. మొత్తంగా.. అతని 41 పరుగుల నెమ్మది ఇన్నింగ్స్‌ విమర్శలపాలైంది.

Read More: Delhi T20లో బంగ్లాదేశ్ క్రికెటర్లకి వాంతులు
‘బంగ్లాదేశ్‌తో మిగిలిన ఉన్న రెండు టీ20ల్లోనూ ఒకవేళ శిఖర్ ధావన్ ఫెయిలైతే..? జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు మొదలవుతాయి. టీ20ల్లో బంతులతో సమానంగా ఓ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడం టీమ్‌కి ఏమాత్రం లాభించదు. ఈ విషయంలో అతను కచ్చితంగా పునరాలోచించుకోవాలి. లయ అందుకోవడానికి సమయం పడుతుంది.. నిజమే.. కానీ.. సిరీస్‌లో అతను తన సత్తా నిరూపించుకోక తప్పదు’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

Read More: పేరుకేమో పవర్ హిట్టర్.. షాట్ మాత్రం..?
ఆస్ట్రేలియా గడ్డపై వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. టీమ్‌లోని ఆటగాళ్లకి రెండు మూడు అవకాశాలు మించి ఇవ్వలేమని ఇటీవల కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో.. ఒకవేళ ధావన్.. ఈ బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఫెయిలైతే.. అతని స్థానంలో మళ్లీ కేఎల్ రాహుల్ లేదా మరొకరు ఓపెనర్‌గా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.