యాప్నగరం

బంగ్లా‌తో టెస్టు: టీమిండియాలో కీలక మార్పు

బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఏకైక టెస్టు కోసం టీమిండియా కీలక మార్పులు చేసింది.

TNN 8 Feb 2017, 1:13 pm
బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఏకైక టెస్టు కోసం టీమిండియా కీలక మార్పులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ స్థానంలో అజింక్య రహానేను జట్టులోకి తీసుకుంది. ఇంగ్లండ్‌తో చెన్నైలో జరిగిన చివరి టెస్టులో 199 పరుగులు చేసిన రాహుల్ ఒక్క పరుగు తేడాతో ద్విశతకాన్ని కోల్పోయాడు. కానీ తర్వాత అదే జట్టుతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడిన రాహుల్.. మొత్తంగా 125 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు రహానే గాయం నుంచి కోలుకోవడంతో.. రాహుల్ స్థానంలో అతణ్ని తుది జట్టులోకి తీసుకోవాలని కెప్టెన్ కోహ్లి నిర్ణయించాడు.
Samayam Telugu india vs bangladesh hyderabad test rahane in and lokesh rahul out
బంగ్లా‌తో టెస్టు: టీమిండియాలో కీలక మార్పు


చెన్నై టెస్టులో ట్రిపుల్ సెంచరీ బాదిన కరుణ్ నాయర్‌ను కోహ్లి తుది జట్టులోకి తీసుకున్నాడు. కరుణ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడంటూ కోహ్లి అతడిపై ప్రశంసలు కురిపించాడు. ఇటీవల న్యూజిలాండ్‌ గడ్డమీద బంగ్లాదేశ్ ఆకట్టుకునే ప్రదర్శన చేసిందని, ఆ జట్టును తక్కువగా అంచనా వేయబోమని కోహ్లి మీడియాతో చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌తో బరిలో దిగే అవకాశం ఉంది. మురళీ విజయ్, నాయర్ ఓపెనర్లుగా బరిలో దిగితే... తర్వాతి స్థానాల్లో పుజారా, రహానే, కోహ్లి బ్యాటింగ్‌కు రానున్నారు. ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజా ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. సాహా వికెట్ కీపర్‌గా వ్యవహరంచే అవకాశం ఉంది. ఉమేశ్, ఇషాంత్ శర్మ పేస్ అటాక్ చేయనున్నారు. జయంత్ యాదవ్, యూపీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లలో ఎవరో ఒకరే ఆడే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.