యాప్నగరం

ఇంగ్లాండ్‌పై విరాట్ కోహ్లీ వీరోచిత శతకం..!

ఇంగ్లాండ్ గడ్డపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వీరోచిత శతకం బాదాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సహచరులందరూ వరుసగా

Samayam Telugu 2 Aug 2018, 10:13 pm
ఇంగ్లాండ్ గడ్డపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వీరోచిత శతకం బాదాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సహచరులందరూ వరుసగా పెవిలియన్ చేరుతున్నా.. మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లి 172 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కెరీర్‌లో కోహ్లీకి ఇది 22వ టెస్టు శతకంకాగా.. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో ఈ భారత కెప్టెన్‌కి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
Samayam Telugu Virat-Kohli


ఈ రోజు తొలి సెషన్‌ ఆరంభంలోనే ఇంగ్లాండ్ జట్టు 287 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు మురళీ విజయ్ (20), శిఖర్ ధావన్ (26) కాసేపు క్రీజులో నిలిచినా.. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ (4), అజింక్య రహానె (15), దినేశ్ కార్తీక్ (0) నిరాశపరచడంతో భారత్ చూస్తుండగానే 100/5తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది.

ఈ దశలో హార్దిక్ పాండ్య (22)తో కలిసి కాసేపు స్కోరు బోర్డుని నడిపించిన కోహ్లి.. అనంతరం అశ్విన్‌ (10), ఇషాంత్ శర్మ (5)ల సాయంతో శతకానికి చేరువయ్యాడు. కోహ్లి 90లోకి వచ్చినప్పుడు ఇషాంత్ ఔటైనా.. అనంతరం వచ్చిన ఉమేశ్ యాదవ్ (1 బ్యాటింగ్) చక్కటి సహకారం అందించాడు. ఇన్నింగ్స్‌ 65వ ఓవర్ వేసిన బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన కోహ్లి.. ఇంగ్లాండ్ గడ్డపై తన చిరకాల శతక స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. 2014 పర్యటనలో కోహ్లి ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ 232/9తో కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.