యాప్నగరం

ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టిన అశ్విన్..!

ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత స్పిన్నర్ అశ్విన్ తన జోరుని కొనసాగిస్తున్నాడు. ఆటలో మూడోరోజైన శుక్రవారం

Samayam Telugu 3 Aug 2018, 5:00 pm
ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత స్పిన్నర్ అశ్విన్ తన జోరుని కొనసాగిస్తున్నాడు. ఆటలో మూడోరోజైన శుక్రవారం 9/1తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు ఆరంభంలోనే అశ్విన్ ధాటికి వరుసగా రెండు వికెట్లను చేజార్చుకుంది. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ వేసిన అశ్విన్ బౌలింగ్‌లో బంతిని కట్ చేయబోయి ఓపెనర్ జెన్నింగ్స్ (8: 18 బంతుల్లో 1x4) ఫీల్డర్ రాహుల్‌ చేతికి చిక్కగా.. 15వ ఓవర్‌ కెప్టెన్ జో రూట్ (14: 35 బంతుల్లో 1x4) కూడా అదే తరహాలో వికెట్ చేజార్చుకున్నాడు. గురువారం ఆట ముగుస్తుందన్న దశలో ఓపెనర్ అలిస్టర్‌ కుక్‌‌ని డకౌట్ రూపంలో అశ్విన్ పెవిలియన్ బాట పట్టించిన విషయం తెలిసిందే.
Samayam Telugu England v India - First Test
Cricket - England v India - First Test - Edgbaston, Birmingham, Britain - August 1, 2018 India's Ravichandran Ashwin celebrates taking the wicket of England's Jos Buttler Action Images via Reuters/Andrew Boyers


తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ 62 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా.. ఇంగ్లాండ్ జట్టు 287 పరుగులకి ఆలౌటైంది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆడిన భారత్ జట్టు విరాట్ కోహ్లి (149) శతకం బాదడంతో గురువారం 76 ఓవర్లలో 274 పరుగులకి ఆలౌటైంది. దీంతో.. 13 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందుకున్న ఇంగ్లాండ్ జట్టు.. 61/3తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆ జట్టు ఆధిక్యం 74 పరుగులుకాగా.. క్రీజులో మలాన్ (18), బెయిర్‌స్టో (13) ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.