యాప్నగరం

టెయిలెండర్లను చూసి నేర్చుకోండి: కోహ్లి

భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు టెయిలెండర్ల ఆట చూసి నేర్చుకోవాలని కెప్టెన్ విరాట్ కోహ్లి చురకలు అంటించాడు. ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా శనివారం ముగిసిన

Samayam Telugu 4 Aug 2018, 7:35 pm
భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు టెయిలెండర్ల ఆట చూసి నేర్చుకోవాలని కెప్టెన్ విరాట్ కోహ్లి చురకలు అంటించాడు. ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (149, 51) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌‌లు విఫలమవడంతో భారత్ జట్టు 31 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు 182/8తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్.. కెప్టెన్ కోహ్లికి చక్కటి సహకారం అందించారు. వారి అండతోనే శతకాన్ని పూర్తి చేసుకున్న కోహ్లి.. భారత జట్టుని 274 పరుగుల వరకూ తీసుకెళ్లాడు.
Samayam Telugu England v India - First Test
Cricket - England v India - First Test - Edgbaston, Birmingham, Britain - August 4, 2018 England's Ben Stokes and James Anderson celebrate the wicket of India's Virat Kohli Action Images via Reuters/Andrew Boyers


మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి మాట్లాడుతూ ‘టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ల షాట్ సెలక్షన్ ఇంకా మెరుగవ్వాలి. తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని సిరీస్‌లో ముందుకు సాగుతాం. తొలి ఇన్నింగ్స్‌లో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు చాలా బాగా ఆడారు. వారి నుంచి చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా.. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్.. ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొని చక్కగా క్రీజులో నిలిచారు. ఈ ఓటమితో దాచేందుకు ఏమీ లేదు. తర్వాత మ్యాచ్‌లో మొరుగవ్వడం తప్ప’ అని విరాట్ కోహ్లి వెల్లడించాడు. రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 9 నుంచి జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.