యాప్నగరం

రాజ్‌కోట్ చేరుకున్న టీం ఇండియా

ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జరగనున్న రాజ్‌కోట్‌కు భారత క్రికెట్ జట్టు శనివారం చేరుకుంది.

TNN 5 Nov 2016, 5:56 pm
ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జరగనున్న రాజ్‌కోట్‌కు భారత క్రికెట్ జట్టు శనివారం చేరుకుంది. కోచ్ అనిల్ కుంబ్లేతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి, గౌతం గంభీర్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్ ఇతర జట్టు సభ్యులు రాజ్‌కోట్ చేరుకున్నారని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మీడియా మేనేజర్ హిమాన్షు షా వెల్లడించారు.
Samayam Telugu india vs england 2016 indian team reaches rajkot
రాజ్‌కోట్ చేరుకున్న టీం ఇండియా


స్థానిక ఆటగాళ్లు ఛటేశ్వర పుజారా, రవీంద్ర జడేజా జట్టుతో కలుస్తారని చెప్పారు. అయితే హార్దిక్ పాండ్యా రోడ్డు మార్గం ద్వారా వస్తున్నాడని వెల్లడించారు. కాగా, రాజ్‌కోట్‌లోని ఖంధేరీలో ఉన్న సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో నవంబర్ 9 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం అవుతుంది.

మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి ఈరోజు 28 ఏట అడుగుపెట్టాడు. భారత జట్టు బసచేస్తున్న హోటల్ ఇంపీరియల్‌లో ఈ రాత్రికి కోహ్లి పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడానికి విరాట్ ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా రాజ్‌కోట్ చేరుకుంది. కోహ్లితో పాటే నేరుగా హోటల్‌కు వెళ్లింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.