IND vs ENG: వన్డే సిరీస్పై కన్నేసిన భారత్.. ఈరోజే రెండో వన్డే
భారత్ గడ్డపై పర్యాటక ఇంగ్లాండ్కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్ని టీమిండియాకి సమర్పించుకున్న ఇంగ్లాండ్.. వన్డే సిరీస్పై ఆశలు నిలవాలంటే ఈరోజు మ్యాచ్లో తప్పక గెలవాలి.
Samayam Telugu 26 Mar 2021, 7:41 am
ప్రధానాంశాలు:
- భారత్, ఇంగ్లాండ్ మధ్య ఈరోజే పుణెలో రెండో వన్డే
- సిరీస్పై కన్నేసిన టీమిండియా.. ఆశలు నిలుపుకోవాలని ఇంగ్లాండ్
- కెప్టెన్సీ వహించబోతున్న జోస్ బట్లర్.. మోర్గాన్ ఔట్
- కనీసం మూడు మార్పులతో బరిలోకి దిగబోతున్న టీమిండియా
ఇంగ్లాండ్పై వరుసగా టెస్టు, టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్పై కన్నేసింది. పుణె వేదికగా గత మంగళవారం జరిగిన తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకున్న భారత్ జట్టు.. మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక పుణె వేదికగానే శుక్రవారం మధ్యాహ్నం 1.30 నుంచి రెండో వన్డే ప్రారంభంకానుండగా.. ఈ మ్యాచ్లో గెలిచి.. సిరీస్ని చేజిక్కించుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. తొలి వన్డేలో 98 పరుగులు చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్ ఎట్టకేలకి ఫామ్ అందుకోగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ మోచేతి గాయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ భుజం గాయం కారణంగా ఈ వన్డే సిరీస్కి దూరమవడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ లేదా రిషబ్ పంత్ని ఆడించే అవకాశం ఉంది. అరంగేట్రం వన్డేలో ఆల్రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కృనాల్ పాండ్య.. ఈ మ్యాచ్లోనూ ఆడనుండగా.. హార్దిక్ పాండ్యా నుంచి మెరుపుల్ని టీమిండియా ఆశిస్తోంది. బౌలింగ్లో శార్ధూల్ ఠాకూర్ మ్యాచ్లను మలుపు తిప్పే ప్రదర్శన కనబరుస్తున్నా.. టీ20 సిరీస్ నుంచి వరుసగా మ్యాచ్లు ఆడుతున్న అతనికి రెస్ట్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అతని స్థానంలో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్ తుది జట్టులోకి రానున్నాడు. ఇక మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తొలి వన్డేలో పూర్తిగా తేలిపోగా.. అతని స్థానంలో చాహల్ని తీసుకోవడంపై చర్చిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా తుది జట్టులో కనీసం మూడు మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
తొలి వన్డేలో ఓడిన ఇంగ్లాండ్ టీమ్.. ఒకింత ఒత్తిడిలోనే రెండో వన్డే ఆడనుంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, శామ్ బిల్లింగ్స్ గాయాల కారణంగా వన్డే సిరీస్కి దూరమయ్యారు. దాంతో.. జోస్ బట్లర్ ఆ టీమ్కి నాయకత్వం వహించనుండగా.. బౌలింగ్లోనూ ఆ జట్టు అంచనాల్ని అందుకోలేకపోయింది. అయితే.. ఓపెనర్లు జేసన్ రాయ్, జానీ బెయిర్స్టో మాత్రం ఆ జట్టుకి మెరుగైన ఆరంభమిచ్చారు. కానీ.. మిడిలార్డర్ తేలిపోయింది. దాంతో.. రెండో వన్డేలోనైనా తప్పిదాల్ని దిద్దుకుని సిరీస్పై ఆశలు నిలుపుకోవాలని ఇంగ్లాండ్ ఆశిస్తోంది.
తొలి వన్డేలో ఓడిన ఇంగ్లాండ్ టీమ్.. ఒకింత ఒత్తిడిలోనే రెండో వన్డే ఆడనుంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, శామ్ బిల్లింగ్స్ గాయాల కారణంగా వన్డే సిరీస్కి దూరమయ్యారు. దాంతో.. జోస్ బట్లర్ ఆ టీమ్కి నాయకత్వం వహించనుండగా.. బౌలింగ్లోనూ ఆ జట్టు అంచనాల్ని అందుకోలేకపోయింది. అయితే.. ఓపెనర్లు జేసన్ రాయ్, జానీ బెయిర్స్టో మాత్రం ఆ జట్టుకి మెరుగైన ఆరంభమిచ్చారు. కానీ.. మిడిలార్డర్ తేలిపోయింది. దాంతో.. రెండో వన్డేలోనైనా తప్పిదాల్ని దిద్దుకుని సిరీస్పై ఆశలు నిలుపుకోవాలని ఇంగ్లాండ్ ఆశిస్తోంది.