యాప్నగరం

ఈరోజే భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టీ20

ఇంగ్లాండ్‌ పర్యటనని ఘన విజయంతో ఆరంభించిన భారత్.. టీ20 సిరీస్‌పై కన్నేసింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గత మంగళవారం జరిగిన తొలి

Samayam Telugu 6 Jul 2018, 7:43 am
ఇంగ్లాండ్‌ పర్యటనని ఘన విజయంతో ఆరంభించిన భారత్.. టీ20 సిరీస్‌పై కన్నేసింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గత మంగళవారం జరిగిన తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకున్న టీమిండియా.. శుక్రవారం రాత్రి 10 గంటలకి ఇంగ్లాండ్‌తో రెండో టీ20 ఆడనుంది. భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే వరుసగా ఆరో టీ20 సిరీస్‌ గెలిచిన జట్టుగా చరిత్రలో నిలవనుంది.
Samayam Telugu England v India - First International T20


సొంతగడ్డపై తొలి టీ20లో అనూహ్యంగా బోల్తా కొట్టిన ఇంగ్లాండ్ జట్టు సిరీస్‌లో పుంజుకోవాలని ఆశిస్తోంది. ముఖ్యంగా.. భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ధాటికి ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కనీసం కాసేపు కూడా క్రీజులో నిలవలేకపోయారు. దీంతో.. గురువారం ప్రాక్టీస్ సెషన్‌లో మెర్లిన్‌ అనే బౌలింగ్ యంత్రం సాయంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్‌ ప్రాక్టీస్ చేశారు. గతంలో ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ని ఎదుర్కోనేందుకు ఈవిధంగా ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ ప్రాక్టీస్ చేశారు.

భారత జట్టు ఇప్పుడు సూపర్ ఫామ్‌లో ఉంది. కేఎల్ రాహుల్ శతకంతో ఇప్పటికే జట్టులో జోష్ నింపగా.. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ కూడా ఐర్లాండ్‌పై మెరుపు ఇన్నింగ్స్‌లతో ధీమాగానే ఉన్నారు. ఇక బౌలింగ్‌లో బుమ్రా లేని తెలియకుండా ఉమేశ్ యాదవ్ చక్కగా భువనేశ్వర్‌తో కలిసి రాణిస్తున్నాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ కెరీర్‌లో బెస్ట్ ప్రదర్శనతో మంచి ఉత్సాహంలో ఉండటంతో రెండో టీ20లోనూ భారత్ జట్టే ఫేవరెట్‌గా చెప్పవచ్చు..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.