యాప్నగరం

వరుస ఓవర్లలో ఇంగ్లాండ్ ఓపెనర్లు ఔట్

భారత్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు వరుస ఓవర్లలో ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. ఆటలో

Samayam Telugu 11 Aug 2018, 4:40 pm
భారత్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు వరుస ఓవర్లలో ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. ఆటలో మూడో రోజైన శనివారం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఆదిలోనే దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. ఓపెనర్ అలిస్టర్ కుక్ (21: 25 బంతుల్లో 4x4) వరుస బౌండరీలతో కాసేపు స్కోరు బోర్డుని పరుగులెత్తించగా.. మరో ఓపెనర్ జెన్నింగ్స్ (11: 22 బంతుల్లో) అతనికి చక్కటి సహకారం అందించాడు. అయితే.. భారత పేసర్లు వరుస ఓవర్లలో వీరిద్దరినీ పెవిలియన్ బాట పట్టించారు.
Samayam Telugu England v India - Second Test


ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన మహ్మద్ షమీ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించిన జెన్నింగ్స్‌ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. అంపైర్ ప్రకటించిన ఎల్బీడబ్ల్యూ ఔట్ నిర్ణయంపై అనుమానం వ్యక్తం చేసిన జెన్నింగ్స్.. సమీక్షకి వెళ్లినా అతనికి నిరాశ తప్పలేదు. ఆ తర్వాత ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో మరో ఓపెనర్ అలిస్టర్ కుక్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్‌కి సమీపంలో వెళ్తున్న బంతిని కట్ చేసేందుకు కుక్ ప్రయత్నించగా.. అతని బ్యాట్ అంచున తాకిన బంతి నేరుగా వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. దీంతో.. 8.2 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 32/2తో నిలిచింది. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకి ఆలౌటైన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.