యాప్నగరం

ఆల్‌రౌండర్‌గా కపిల్ సరసన అశ్విన్..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డుల్లో నిలిచాడు. వర్షం

Samayam Telugu 11 Aug 2018, 8:19 pm
ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డుల్లో నిలిచాడు. వర్షం కారణంగా.. ఒక్కరోజు ఆలస్యంగా.. ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ విఫలమైనా.. అశ్విన్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో.. భారత మేటి ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ చోటు సంపాదించాడు.
Samayam Telugu 1533985910-ashwin-virat-ap


అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు కొద్దిమంది భారత క్రికెటర్లు మాత్రమే బంతితో 500 వికెట్లు పడగొట్టి.. బ్యాట్‌తో 3వేల పరుగులు చేశారు. ఈ జాబితాలో కపిల్‌ దేవ్ అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ ఉన్నారు. తాజాగా లార్డ్స్‌ టెస్టు‌లో కీలక ఇన్నింగ్స్‌తో అశ్విన్ కూడా చేరాడు.

అశ్విన్ కెరీర్‌లో ఇప్పటి వరకు 60 టెస్టులు, 111 వన్డేలు, 46 టీ20 మ్యాచ్‌లాడగా.. టెస్టుల్లో 2,215 పరుగులు, వన్డేల్లో 675, టీ20ల్లో 123 రన్స్ చేశాడు. బంతితో మూడు ఫార్మాట్లలో కలిపి ఈ ఆఫ్ స్పిన్నర్ మొత్తం 525 వికెట్లు పడగొట్టాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.