యాప్నగరం

భారత్ విజయానికి మూడు వికెట్లు

ఇంగ్లండ్‌తో విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం ఖాయంగా కనిపిస్తోంది.

TNN 21 Nov 2016, 12:14 pm
ఇంగ్లండ్‌తో విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. టీం ఇండియా విజయానికి ఇంకా మూడు వికెట్ల దూరంలో నిలుచుంది. ఐదురోజు లంచ్ విరామ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇంకా 263 పరుగులు వెనకబడి ఉంది.
Samayam Telugu india vs england 2nd test visakhapatnam india need 3 wickets for win
భారత్ విజయానికి మూడు వికెట్లు


రెండో ఇన్నింగ్స్‌లో 87/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్ ఒత్తిడిలో వరసగా వికెట్లు పారేసుకుంది. అద్భుత ఫాంలో ఉన్న జో రూట్‌ (25)ను మహ్మద్ షమీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తరవాత డకెట్ (0), అలీ (2), బెన్ స్టోక్స్ (6) వరస కట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రషీద్ (4) షమీ బౌలింగ్‌లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ప్రస్తుతం క్రీజులో బెయిర్‌స్టో (23), అన్సారీ (0) ఉన్నారు. భారత బౌలర్లలో షమీ, అశ్విన్, జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జయంత్ యాదవ్ ఒక వికెట్ తీసాడు. అద్భుతం జరిగితే తప్పా ఈ టెస్టులో భారత్ విజయం ఖాయం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.